శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  

    ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా  ఈరోజు విజయవాడకు చెందిన ఎన్. వరలక్ష్మి గారి బృందం 350 మంది, శ్రీ కనకదుర్గా అమ్మవారి ఉత్సవ సేవా కమిటీ వారు 200 మంది, పాయకాపురం కు చెందిన ఆర్.అన్నపూర్ణ గారి బృందం 200 మంది, 


కృష్ణలంక కు చెందిన శ్రీ జి. శ్రీనివాసరావు గారి బృందం 123 మంది, మచిలీపట్నం కు చెందిన భ్రమరాంబ  సేవాసమితి 108 మంది, క్రిష్ణలంకకు చెందిన బి.లక్ష్మీ గారి బృందం 61 మంది, ఉండవల్లికి చెందిన కె.నాగమణి గారి బృందం 60 మంది మరియు వివిధ ప్రాంతాలకు చెందిన పలు బృందముల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.


 అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహింపజేసి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది.

Comments