అమరావతి (ప్రజా అమరావతి);
*రేపు, ఎల్లుండి సీఎం శ్రీ వైయస్ జగన్... వైఎస్ఆర్ జిల్లా పర్యటన*
*రేపు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం*
*ఎల్లుండి ఉదయం దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికి నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి, అనంతరం విజయవాడ చేరుకుని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం*.
*07.07.2022 షెడ్యూల్*
ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్ చేరుకుంటారు, అక్కడ న్యూటెక్ బయోసైన్సెస్కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లి చేరుకుంటారు. 3.30 గంటలకు డాక్టర్ వైఎస్సార్ స్మారక పార్క్కు చేరుకుని పార్క్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధిని, విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
*08.07.2022 షెడ్యూల్*
ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05 గంటలకు వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం.
addComments
Post a Comment