అమరావతి (ప్రజా అమరావతి);
*సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలపై క్యాంప్ కార్యాలయంలో సీఏం శ్రీ వైస్.జగన్ సమీక్ష.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..*
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనకు ఎప్పుడూ కూడా ఇంతగా ప్రయత్నాలు చేయలేదు:
ఎస్డీజీకు సంబంధించి మనం ఇంత బాగా చేస్తున్నా కూడా, సమర్థవంతమైన రిపోర్టింగ్ కూడా అవసరం:
రిపోర్టింగ్ మానిటరింగ్ అనేది సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పనిచేసినా లాభం లేదు:
ఇప్పుడు జాతీయ స్ధాయిలో పోటీపడ్డం ద్వారా...దేశంలో తొలిస్ధానంలో నిలబడ్డానికి అవకాశం వచ్చింది:
గతంలో ఈ పరిస్థితి లేదు, మరేరాష్ట్రంలో ఇన్ని పథకాలు లేవు:
తొలిసారిగా మనం చేస్తున్నాం :
క్యాలెండర్ ప్రకారం మిస్ కాకుండా.. ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్ ప్రకటిస్తున్నాం:
డీబీటీ ద్వారా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు పోతున్నాయి:
అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్ మోడ్లో ఈ పథకాలు... అందిస్తున్నాం:
జిల్లాల్లో కలెక్టర్లు ఎస్డీజీ రిపోర్టును మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి.
విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం:
ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ:
ప్రతి నెలా ఎస్డీజీ రిపోర్టును కలెక్టర్ పర్యవేక్షణ చేయాలి:
సచివాలయం నుంచి డేటా జిల్లా స్ధాయికి చేరాలి:
వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు.
ఎంఎస్ఎంఈ రంగంలోనూ మనం చేస్తున్న కృషి మరే రాష్ట్రంలోనూ లేదు:
ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ఇచ్చి బటన్ నొక్కి ఎంఎస్ఎంఈలకు టైం ప్రకారం ఇన్సెంటివ్లు ఇస్తున్నాం:
దేశంలో ఎక్కడా ఇలా జరగడం లేదు:
రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు:
గత ప్రభుత్వ ఇన్సెంటివ్లకు సంబంధించిన బకాయిలు కూడా మనమే చెల్లించాం:
ప్రతిరంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్ వేయగల పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి:
అమ్మఒడి, టీఎంఎప్, ఎస్ఎంఎఫ్లను సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదు:
సంపూర్ణపోషణ, గోరుముద్ద కూడా సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదు:
విద్యాకానుక, విద్యా దీవెన, పుల్ ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20వేలు వసతి దీవెన గతంలో ఎప్పుడూ జరగలేదు:
ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీలో దాదాపు 3వేల చికిత్సా విధానాలు, 16 కొత్తమెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో మొత్తం ఆసుపత్రుల పునర్వ్యవస్ధీకరణ, ఆరోగ్యఆసరా ఇవేవీ గతంలో లేవు.
మహిళా సాధికారతలో చేయూత, ఆసరా, అమ్మఒడి, సున్నావడ్డీ, మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఒక్క బటన్ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసింది:
దేశంలో ఈ తరహా డీబీటీ విధానం లేదు:
ఇవన్నీ కచ్చితంగా ప్రతిబింబించాలి:
ఎస్డీజీకి సంబధించిన కచ్చితంగా ఎస్ఓపీలు ఉండాలి:
వాటిని నిరంతరం పాటించాలి:
ఎన్ని రోజులకొకమారు సమావేశం కావాలన్నదానిపై నిర్ధిష్టమైన సమాచారం ఉండాలి:
గతేడాది ఇది లోపించింది, ఈ దఫా అలా జరగడానికి వీలులేదు:
కచ్చితంగా ఎస్డీజీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్ డేట్ చేయాలి:
విద్యాశాఖలో నూటికి నూరుశాతం ఎస్డీజీ లక్ష్యాలను సాధించాలన్న సీఎం
ప్రతినెలా సీఎస్ ఆధ్వర్యంలోనెలకు రెండుదఫాలుగా సమావేశం కావాలి.
మూడు నెలలపాటు ఇలా సమావేశమవ్వాలి.
ఎస్డీజీ మీటింగ్లో సెక్రటరీలు పాల్గొనాలి.
కలెక్టర్లతోనూ మాట్లడాలన్న సీఎం.
దాదాపు 7నుంచి 8 రంగాలలో వైద్యఆరోగ్యరంగం, విద్య, మహిళాసాధికారత, గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్, సోషల్ జస్టిస్, మున్సిపల్శాఖ, పట్టణాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం: అధికారులకు సీఎం నిర్దేశం.
విశాఖపట్నంలో ఐటీహబ్ను నిర్మించాలన్న సీఎం
దీనిపై కార్యారణ రూపొందించాలన్న సీఎం.
అత్యాధునిక వసతులతో నిర్మించాలన్న సీఎం.
సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment