ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డిగారి బక్రీద్‌ శుభాకాంక్షలు


అమరావతి (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డిగారి బక్రీద్‌ శుభాకాంక్షలు*



ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.


  దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారన్నారు.   భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ  పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ ఆకాంక్షించారు. 


అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ అభిలషించారు.

Comments