అమరావతి (ప్రజా అమరావతి)
:
*గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన సీఎం శ్రీ వైయస్.జగన్. అదే సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి విజ్ఞాపన పత్రం అందించిన సీఎం.*
*విజ్ఞాపన పత్రంలోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.*
– రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న సీఎం. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరిన సీఎం.
– తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా కోరిన సీఎం.
– పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరిన సీఎం.
– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.
– రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసిన సీఎం.
– భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరుచేయాలని కోరిన ముఖ్యమంత్రి.
– ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరిన సీఎం.
– విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా కోరిన సీఎం.
addComments
Post a Comment