శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఈరోజు గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు( మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు) శ్రీ కొట్టు సత్యనారాయణ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు.
అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు.
addComments
Post a Comment