శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);


నెల్లూరు నగరంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో    జిల్లా వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు  శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని  భగవంతుని కృపకు పాత్రులు కావాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో  ఈ రోజు నుండి 5 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా తొలి రోజు   మంగళవారం  ఉదయం జరుగుచున్న వసంతోత్సవాల పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్ళూరుపేట  శాసనసభ్యులు  శ్రీ కిలివేటి సంజీవయ్య, నూడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారాకానాథ్ లతో కలసి పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. 


ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ప్రజలందరికీ కల్పించాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి  సంకల్పంతో   శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను జిల్లా కేంద్రంలో  ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం, వి పి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో  భాగంగా  ఈ రోజు నుండి 20 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే ఇక్కడా శ్రీవారి సేవలు నిర్వహిస్తారని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకొని శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో పాల్గొని  భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మరలా నెల్లూరులో నిర్వహించుకుంటున్నట్లు మంత్రి  తెలిపారు.  కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ల అధ్వర్యంలో   చేపట్టడం  జరుగుచున్నదని, ఈ సంధర్భంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు  హృదయ పూర్వక ధన్యవాదాలను తెలుపుతున్నట్లు  మంత్రి  తెలిపారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, భక్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments