పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతం


అమరావతి (ప్రజా అమరావతి);


తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి, సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...


ఈ సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం, ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి శ్రీ భూపేంద్రయాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతం



లో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం, అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం, అందరికీ బెస్ట్‌ విషెష్‌ చెబుతూ సీఎం తన ప్రసంగం ముగించారు.


హాజరైన చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎంవో అధికారులు.

Comments