స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం


అమరావతి (ప్రజా అమరావతి);

 

*స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం*


*విజయవాడలో జాతీయ జెండాను నేడు (15.08.2022, సోమవారం) ఎగురవేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*‌


రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సోమవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు. 


ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు.


ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే తేనీటి విందు (ఎట్‌ హోమ్‌) కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు

Comments