ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో భావితరాలు పయనించాలి

    

నెల్లూరు,  (ప్రజా అమరావతి);


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు  గారి జీవితాన్ని   ఆదర్శంగా తీసుకొని  వారు చూపిన బాటలో భావితరాలు పయనించాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్    పేర్కొన్నారు.


ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా  మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో  ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు,  పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర్య సమరయోధులుగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు  గారు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రజా సేవకు అంకితమై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క ఆశయాలను, జీవితాన్ని ఆదర్శంగా  తీసుకొని నేటి యువత ముందులు పోవాలన్నారు. చిన్నప్పటినుండి ఆయన దేశం కోసం చేసిన త్యాగం, చూపిన ధైర్యం , స్థైర్యం తలమానికమని, ఆనాటి సైమన్ కమిషన్ కు ఎదురు నిలబడి ముందు నన్ను కాల్చండి అంటూ తన గుండెను చూపిన ఆంధ్ర కేసరి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తన లాయరు వృతిని ప్రక్కన పెట్టి  స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మహనీయులు  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా  స్వాతంత్ర్య సమరయోధులను  స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జరుపుకొని దేశ వ్యాప్తంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగ నిరతిని, దేశ సేవను  స్పూర్తిగా తీసుకొని ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. 


ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్  శ్రీ ఆర్.  కూర్మనాథ్,  నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి డి. హరిత,  డి ఆర్ వో  శ్రీమతి వెంకట నారాయణమ్మ, ట్రైనీ డిప్యూటీ  కలెక్టర్ శ్రీ మహేష్,  డి.ఆర్.డి.ఏ, డ్వామా పిడి.లు శ్రీ  సాంబశివా  రెడ్డి, శ్రీ  వెంకట్రావు, బి.సి కార్పొరేషన్ ఈడీ శ్రీ బ్రహ్మానంద రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి,  సోషల్ వెల్ఫేర్ డి.డి. శ్రీమతి రమాదేవి, జిల్లా మైనారిటి వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవాని,  జిల్లా బి.సి.వెల్ఫేర్ అధికారి  శ్రీ వెంకటయ్య, ఏపిఎస్పిడిసిఎల్ ఎస్.ఈ శ్రీ  విజయకుమార్ రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

Comments