శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీఅమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందజేశారు.
addComments
Post a Comment