రామచంద్రపురం (ప్రజా అమరావతి);
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అవినీతి లేని పాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన
అందిస్తున్నారు:- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ చెల్లి బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.
మంగళవారం సాయంత్రం రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని 5 వ వార్డు వైస్సార్ పేట లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అవినీతి లేని పాలనే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు
ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు నక్కా కిషోరి అమ్మఒడి 42,000,సున్నా వడ్డీ 1,488, ఇంటిస్థలం 6,00,000
మొత్తం 6,43,488 రూపాయలు లబ్ధి పొందామని ఈ పథకాల ద్వారా మాకు మా కుటుంబ సభ్యులకు చాలా ప్రయోజనం కలిగిందని దాంతోపాటు సంతోషంగా జీవిస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ గాధంసెట్టి శ్రీదేవి, కమీషనర్ శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment