అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే చాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి.
అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం శ్రీ వైఎస్ జగన్.
కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.
ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా నిలిచిన కార్తీక్. అంతకుముందు ఏప్రిల్లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ చాంపియన్షిప్లోనూ స్వర్ణపతకాన్ని గెలుచుకున్న కార్తీక్. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించిన కార్తీక్. అక్టోబర్లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొని పతకం సాధిస్తానన్న కార్తీక్.
తాను సాధించిన పతకాలను సీఎం శ్రీ వైఎస్ జగన్కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కోరిన కార్తీక్. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడి.
కార్తీక్ రెడ్డి స్వస్ధలం తిరుపతి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్.కే.రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి.
addComments
Post a Comment