ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);
శ్రీకాళహస్తి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు.
గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు అమ్మవారి పేరున కనకదుర్గమ్మ ఆలయం ఈవో డి భ్రమరాంబకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి దసరా శరన్నవరాత్రుల సమయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్తాలను అందజేయడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తి ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో శ్రీకాళహస్తి డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కె.అయ్యన్న, ఆలయ కమిటీ సభ్యులు మున్నా రాయల్, జయ శాయ్యంరాయల్, సునీత, రమాప్రభ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment