మంగళగిరి నియోజకవర్గం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన...
దుగ్గిరాల (ప్రజా అమరావతి);
దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .
స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న లోకేష్.
నారా లోకేష్ పర్యటిస్తుండగా గ్రామం లో విద్యుత్ సరఫరా నిలిపివేత.
చీకటి లోనే వీదుల్లో తిరుగుతున్న లోకేష్.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన లోకేష్.
లూధరన్ చర్చి లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్న లోకేష్
బాదుడే బాదుడు కరపత్రం పంచుతూ వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్.
ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తెచ్చిన ప్రజలు.
చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్న లోకేష్.
కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్
.
సంక్షేమం గోరంత... బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత.
అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారు.
పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలి.
మద్యపాన నిషేదం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నారు.
ఫ్రీగా దొరికే ఇసుకను బంగారం చేసి ఎంతో మందికి ఉపాధి లేకుండా చేశారు.
ఇసుక బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు. దోచుకున్న సొమ్మంతా నేరుగా తాడేపల్లి ప్యాలస్ కి వెళ్తుంది.
రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది.
ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదు.
అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని పెన్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.
ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు.
చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోసే చెత్త ప్రభుత్వం ఇది.
గ్రామంలో ఉచితంగా త్రాగు నీరు అందిచడానికి జలధార కార్యక్రమం ప్రారంభించాలి అనుకుంటే చెయ్యనివ్వడం లేదు.
ప్రభుత్వం చెయ్యదు మమ్మల్ని చెయ్యనివ్వదు.
అన్న క్యాంటీన్ అలానే అడ్డుకున్నారు.
ఇప్పుడు జలధార కి అడ్డుపడుతున్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉచితంగా త్రాగునీరు అందించే
జలధార కార్యక్రమం ప్రారంభించి తీరుతాం.
addComments
Post a Comment