ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని సీఎం ఆదేశం.



*వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

– వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు. 

– కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి  సమయం కావాలని కోరిన అధికారులు

– అక్టోబరు 5కు బదులు, అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం. 

– దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం. 

–  ప్రస్తుతం వైయస్సార్‌ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు, కొత్త వాటి చేరికతో 3,254 చేరనున్న చికిత్సల సంఖ్య. 


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:*


– ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగింది:

–పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరాకోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104లకోసం సుమారు మరో రూ.400 కోట్లు చేస్తున్నాం: 

– మొత్తంగా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104లకోసం ఖర్చు చేస్తున్నాం:

– ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం:


–మరో 432 కొత్త 104–వాహనాలు. 

– డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానున్న కొత్త వాహనాలు. 

– ఇప్పటికే సేవలందిస్తున్న 676 వాహనాలు. 

– మొత్తంగా 1108కి చేరనున్న 104 వాహనాలు.

– అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108–వాహనాలు.

– వీటి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశం. 


– విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామన్న అధికారులు.

– కోవిడ్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశం. 


– ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని సీఎం ఆదేశం. 


– దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ చేయాలన్న సీఎం. 

– ఈ ఆడిట్‌ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలన్న సీఎం. 

– క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలన్న సీఎం. 

– ఎక్కడ ఖాళీ వచ్చినా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్న సీఎం. 

– ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్‌ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు ఆలోచన కూడా చేయాలన్న సీఎం. 


*పేషెంట్‌ డైట్‌ ఛార్జీల పెంపునకు ఆదేశం...*

–ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశం.

ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100లకు పెంచాలన్న సీఎం, నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలన్న సీఎం. 

– జూనియర్‌డాక్టర్ల స్టై ఫండ్‌ పెంపుపైనా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 


– కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్ష. 

- మెడికల్ కాలేజీల నిర్మాణపనులపై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం.

– అర్బన్‌హెల్త్‌ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయన్న అధికారులు.


*ఏపీకి 6 ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డులు...*

– కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకి వచ్చాయని సీఎంకు వివరించిన అధికారులు.

– మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయన్న అధికారులు.

– ఆరోగ్య రంగంలో సీఎం తీసుకుంటున్న చర్యలకు వచ్చిన గుర్తింపు అని పేర్కొన్న అధికారులు.


ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్,  ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, డాక్టర్‌ వైయస్సార్‌ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్ర ప్రసాద్,  వైద్య ఆరోగ్యశాఖ డీజీ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments