*ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే రూ.1790 కోట్లు
వెచ్చించాం*
*రూ.199.5 కోట్లు ఈహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించాం*
*ఆరోగ్యశ్రీ సిఇవో హరేందిర ప్రసాద్ వెల్లడి*
అమరావతి (ప్రజా అమరావతి);
జూలై 2022 వరకు నెట్ వర్క్ ఆసుపత్రుల
క్లెయిమ్స్ చెల్లించామని
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(CEO) శ్రీ యమ్. యన్. హరేందిర ప్రసాద్ IAS నేడొక ప్రకటనలో తెలిపారు.
ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఎటువంటి చెల్లింపులు జరగలేదని జరుగుతున్న ప్రచారం
నిజం కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లుల కోసం తాము వినియోగించలేదని ఆయన స్పష్టం చేశారు.
2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఒక్క
రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
ఇప్పటివరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నిధులు రూ.1790 కోట్లని ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం వినియోగించిందని వివరించారు. రూ.199.5 కోట్లు ఈహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించామన్నారు. 2022-23 సంవత్సరానికి గాను 3,25,390 మంది లబ్దిదారులు ఈహెచ్ ఎస్ పథకం ప్రకారం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స పొందారని పేర్కొన్నారు.
addComments
Post a Comment