నెల్లూరు జిల్లా పర్యటన కొరకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం



*నెల్లూరు జిల్లా పర్యటన కొరకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం*


తిరుపతి, అక్టోబర్ 27 (ప్రజా అమరావతి)


: గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొనటానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10:35 గంటలకు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,  తిరుపతి నగర పాలక మేయర్ డా శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి  ఎమ్మెల్యే లు భూమన కరుణాకరరెడ్డి కోనేటి అదిమూలం, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్,  తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఈ ఎం సి క్లస్టర్ సీఈఓ గౌతమి, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి తదితరులు గౌ ముఖ్య మంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకునగా ముఖ్యమంత్రి ఉదయం గం. 10.45 గం. లకు హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.


వీరితో పాటు ఏర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, సి ఎస్ ఓ రాజశేఖర్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, ఏ ఎస్పీ కులశేఖర్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇంఛార్జి అధికారి దయాసాగర్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments