*అన్నదాత ఆనందంగా ఉంటేనే.. రాష్ట్రం సుభిక్షం !*
* *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. సుధ*
* *ఆళ్లగడ్డ బహిరంగ సభ నుండి.. వరుసగా 4వ ఏడాది రెండవ విడత "వైఎస్ఆర్ రైతు భరోసా" సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి*
* *మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలో పండుగ వాతావరణంలో సాగిన "రైతుభరోసా" జిల్లా అధికారిక కార్యక్రమం*
* *జిల్లాలో 2,02,315 మంది రైతులకు గాను.. రూ. 84.01 కోట్ల 'రైతు భరోసా' సాయం జమ*
కడప, అక్టోబర్ 17 (ప్రజా అమరావతి): అన్నదాత ఆనందంగా ఉంటేనే..
రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి.. అని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. సుధ లు సంయుక్తంగా పేర్కొన్నారు.
సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బహిరంగ సభ నుండి "వైఎస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన" 4వ ఏడాది రెండవ విడత ఆర్ధిక సాయం మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి.. రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నుండి.. మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలోని.. కె.ఎస్.సి. కన్వెన్షన్ హాలు నుండి.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు.. మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. సుధ, జేసీ సాయికాంత్ వర్మ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
** ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు.. ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా.సుధా, జేసీ సాయికాంత్ వర్మ లతో కలిసి.. జిల్లాలో "రైతు భరోసా- పిఎం కిసాన్ యోజన" పథకం క్రింద వరుసగా 4వ ఏడాది రెండవ విడతగా.. 2,02,315 మంది రైతులకు మంజూరైన రూ.84,01,00,000 లు మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో అందజేశారు.
** అనంతరం మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న గత ప్రభుత్వ తీరును మార్చేసి... వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే "రైతు భరోసా" సాయం పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకోచ్చారంటే.. ముఖ్యమంత్రికి రైతులపై ఉన్న అభిమానం, శ్రద్ధ ఎంతటిదో అర్థమవుతోందన్నారు. ప్రతి ఏడాది రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం మహా అద్భుతం అన్నారు. రైతు బలంగా ఉండాలి. రైతు అన్ని విధాలా లాభపడాలనే సదుద్దేశంతో.. రాష్ట్ర.ప్రభుత్వం.. కృషిచేస్తోంది. జలయజ్ఞంలో భాగంగా.. జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిమట్టంతో ఉన్నాయన్నారు. అన్నం పెట్టె అన్నదాత.. ఇచ్చేవాడుగానే వుండాలి తప్ప.. అర్థించే వాడుగా వుండకూడదనేదే.. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచి, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు.. ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు.. సేవలందిస్తున్నాయన్నారు.
** బద్వేలు ఎమ్మెల్యే డా.దాసరి సుధా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు గ్రామసీమల్లో రైతుల పాలిట దేవాలయాలుగా వెలుగొందుతున్నాయన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్బికేలు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో వ్యవసాయ పరిశోధకులను, అక్కడి ప్రభుత్వాలను ఆకర్షిస్తున్నాయన్నారు. అంతేకాకుండా కులం, మతం, ప్రాంతం.. అనే తేడాలేకుండా.. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న ఘనత.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. అన్నిరకాల పథకాలకు మహిళలనే.. ప్రధాన లబ్ధిదారులుగా చేశారన్నారు. అన్నదాతకు వెన్నుగా నిలిచిన ప్రభుత్వంగా దేశంలోనే గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రికి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.
** జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ... రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రానున్న రబీ సీజన్ ఆరంబానికి ముందు.. రైతులకు సాగుబడి ఖర్చుల కోసం.. ఆర్థిక సాయం అందివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. వరుసగా 4వ ఏడాది రెండవ విడత సాయంతో.. ఖరీఫ్ సీజన్ కు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగడం, సాగుబడి కూడా అనూహ్యంగా పెరగడం, దిగుబడులు కూడా చేతికి అందే దశకు చేరుకోవడం జరిగిందన్నారు. ఖరీఫ్ దిగుబడులను కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా.. ప్రభుత్వమే మంచి గిట్టుబాటు ధరతో ఆర్బికేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తం చేస్తోందన్నారు. అర్హత ఉండీ "వైఎస్ఆర్ రైతు భరోసా" పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో.. నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా.. కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు.
** జిల్లా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 4వ ఏడాది రెండవ విడత "వైఎస్సార్ రైతు భరోసా" సాయాన్ని అందించడం ద్వారా.. వ్యవసాయంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామ సీమలో రైతులు సాగుబడిని పండుగ వాతావరణంలో చేపడుతున్నారన్నారు. వాస్తవ సాగుదార్లందరికీ సాయం అందాలన్నది సర్కారు లక్ష్యం కాగా.. ప్రస్తుతం నిరాటంకంగా నాలుగవ ఏడాది రెండవ విడత సాయాన్ని రైతులకు అందివ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు. జిల్లా కేంద్ర సహకార సంఘాల ద్వారా.. అతి తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు అందించి రైతుల ఆర్థిక ప్రగతికి తోడ్పడతోందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన రైతులకు అందించే అన్ని రకాల పథకాలను, రాయితీలను సద్వినియోగించుకుని.. జిల్లా రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
కార్యక్రమానికి ముందుగా.. కె.ఎస్.సి. కన్వెన్షన్ ప్రాంగణంలో.. వ్యవసాయ శాఖ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లు, అందులో ప్రదర్శించిన వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, అధునాతన స్పెయింగ్ డ్రోన్స్ వంటి యాంత్రీకరణ ఉత్పత్తులను గౌరవ ముఖ్య అతిధులైన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర, బద్వేలు ఆర్డీవో వెంకట రమణ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, మైదుకూరు మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర రావు, ఏపీఎంఐపీ పీడి రవీంద్రా రెడ్డి, ఉద్యానశాఖ డిడి మైఖేల్ రాజీవ్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. శారద, డ్వామా పీడి యదుభూషన్ రెడ్డి, స్థానిక జెడ్పిటిసీలు, ఎంపిటిసిలు, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
** *పలువురు రైతుల అభిప్రాయాలు..*
*1. రైతుల ఆత్మగౌరవం పెరిగింది...*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఏర్పడిన నాటినుండి రైతుల ఆత్మగౌరవం పెరిగింది. రైతులకు అవసరమైన అన్నీ సేవలను గ్రామాల్లోనే రైతుల ముంగిళ్ళలోకి తీసుకొచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వంలో ప్రకృతి కూడా.. అనుకూలంగా కరుణిస్తోంది. రాజన్న కలలు కన్న రామరాజ్యం.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కనిపిస్తోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాలు ఉండాలి. రైతు కుటుంబంలో పుట్టినందుకు, ఈ రాష్టంలో ఉన్నందుకు గర్వపడుతున్నా.
- టి.హనుమంతు, మాలాయపల్లె కొత్తపల్లె, మైదుకూరు మండలం
*2. జగనన్నకు శతకోటి ధన్యవాదాలు !*
ప్రభుత్వం అందిస్తున్న 4వ ఏడాది రెండవ విడత రైతు భరోసాతో.. వ్యవసాయం పట్ల రైతన్నలకు మరింత ధీమాను ఇస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజన్న ఆశయాలకు అనుగుణంగా.. రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తున్న మా సీఎం జగనన్నకు శతకోటి ధన్యవాదాలు. అడగకముందే.. అన్ని వర్గాల ప్రజల అవసరాలను గుర్తించి.. సంక్షేమ పథకాల ద్వారా సాయం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి మూలమైన అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న జగనన్న.. ఎప్పటికీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానే కొనసాగాలి.
- ఎం. పెద్ద సుబ్బారెడ్డి, బి.అగ్రహారం, మైదుకూరు మండలం.
*3. సమాజంలో తలెత్తుకుని జీవిస్తున్నాం..*
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో రైతులు తలెత్తుకుని జీవిస్తున్నారు. రైతే రాజు అన్న ధీమాతో.. ముందుకు సాగుతున్నాం. వరుసగా 4వ ఏడాదిలో రెండవ విడత కూడా.. రైతు భరోసా సాయాన్ని అందుకోవడం నా అదృష్టం. కరోనా లాక్ డౌన్ సమయంలో పంట ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ చార్జీలు కూడా ప్రభుత్వమే భరించింది. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు ఇంత సాయం చేయలేదు.
– సి. ఓబయ్య, సర్పంచ్, నంద్యాలంపేట
*4. నష్టాల నుంచి బయటపడగలిగాం.*
ప్రభుత్వం అమలు చేస్తున్న "వైఎస్సార్ రైతు భరోసా" సాయాన్ని వరుసగా 4వ ఏడాది కూడా అందుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఏ కొరత ఉండదు. ఇచ్చిన హామీలకంటే అదనంగా రైతులకు సాయం చేస్తుండటంతో.. రైతు లోకమంతా జగనన్నకు జై కొడుతోంది. జగనన్న ప్రభుత్వం వచ్చాక రైతులు దళారీ వ్యవస్థ నుండి నష్టపోకుండా బయట పడగలిగారు.
- ఎస్. మహబూబ్ బాషా, భీమలింగాయ పల్లె, మైదుకూరు మండలం.
addComments
Post a Comment