ప్రపంచ వారసత్వ సంపద గా ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపు



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



ప్రపంచ వారసత్వ సంపద గా ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపు


మనందరికీ గర్వ కారణం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు.


శనివారం స్థానిక ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతంలో ఐ సి ఐ డి అవార్డ్ స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రులు, అధికారులు, రైతులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కరువు కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడుతుంటే, 1847 లో బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ దొర ను  ఇక్కడ అధ్యయనం చేయడం కోసం పంపించడం జరిగిందన్నారు. ఆనాడు సర్ అర్దర్ కాటన్ దొర బ్యారేజ్ నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చెయ్యడం ద్వారా నేడు కూడా ఇక్కడి ప్రజలు గుండెల్లో చిర స్థాయి గా నిలిచారన్నారు. ఇదే సందర్భంలో మరో వ్యక్తిని గుర్తు చేసుకోవలసి ఉందని, ఆయనే డా వైయస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆనాడు కాటన్ మహాశయుడు నిర్మించిన ప్రాజెక్ట్ 100 సంవత్సరాలు దాటి ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం అవ్వడం తో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం జరిగిందని తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారని అన్నారు.  రెండు కోట్ల సి ఎస్ ఆర్ నిధులతో కాటన్ బ్యారేజ్ రహదారి పనులు పూర్తి చెయ్యడం జరుగుతుందని అన్నారు. కాటన్ మ్యూజియం ను కూడా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.  ఐ సి ఐ డి ఆధ్వర్యంలో  ప్రపంచ హెరిటేజ్ స్ట్రక్చర్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతుండగా, ఆ కార్యక్రమం విశాఖపట్నం లో నిర్వహించడం జరుగుతోందని మంత్రి అన్నారు.


జిల్లా ఇంఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. గాలి, నీరు, ఆహారం మానవ  జీవనానికి ఆయువు పట్టు అన్నారు. మనం తినే ప్రతి బియ్యం గింజ లో  సర్ అర్దర్ కాటన్  ఉన్నాడు అనడం అతిశయోక్తి లేదన్నారు. కాటన్ బ్యారేజ్ కి ప్రపంచ పురాతన కట్టడంగా  గుర్తింపు రావడం ఈరోజు ఆ అవార్డ్ తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిజంగా ధన్యుడన్నారు. చరిత్రలో ఆయన పేరు కూడా చిర స్థాయి గా నిలిచి పోతుందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాటన్ వారసుడిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ను బహుళార్ధక సాగు నీటి ప్రాజెక్ట్ ను శ్రీకారం చుట్టారన్నారు.


రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కాటన్ బ్యారేజి నిర్మాణ వలన ఉభయ గోదావరి జిల్లా లు అన్నపూర్ణగా ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగిందన్నారు. రెండు పంటలు పండే దిశగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. బ్యారేజ్ పై రహదారి ని పూర్తి స్థాయి లో అభివృధి చేసేందుకు, మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. కాటన్ బ్యారేజి గొప్ప తనం  గుర్తించి అవార్డ్ రావడం ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆనందంగా ఉందన్నారు. రెండు పంటలకు బ్యారేజ్ ద్వారా నీరు అందించేలా ఇరిగేషన్ అధికారుల కృషి అభినందిస్తున్నాను. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి, నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరిన్ని జలవనరుల ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తూ, వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందన్నారు. కాటన్ బ్యారేజి కి పూర్వ వైభవాన్ని తీసుకుని వొచ్చే దిశలో నిధులు కేటాయించాలని కోరారు.


పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, వంద సంత్సరాల పాటు ఈ ప్రాంతం ప్రజలు ఉండడమే అవార్డ్ రావడానికి కారణం అన్నారు. అందుకు కారణం వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్ ను పూర్తి స్థాయి లో అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. మనకు ఉన్న సంపదకు అంతర్జాతీయం గా  గుర్తింపు పొందడం, దానిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్య అని ఐ సి ఐ డి వైస్ చైర్మన్ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కి సర్ ఆర్థర్ కాటన్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలన అరుదైన అవకాశం దక్కిందన్నారు.


జిల్లా పరిషత్ ఛైర్మన్ , రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ ఈ విప్పర్తి వేణుగోపాల రావు మాట్లాడుతూ, ₹.3800 కోట్లు డెల్టా ఆధునీకరణ నిధులు వైయస్ రాజశేఖరరెడ్డి కే దక్కిందన్నారు. భావితరాలకు సర్ అర్దర్ కాటన్ గొప్పతనాన్ని తెలియచేసెలా కాటన్ మ్యూజియం ఆధునీకరించాలని కోరారు.


ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్, వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్ కి రావడం గర్వించ దగ్గ ఘట్టం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు.


తొలుత జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్ల గా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు.  ఇరిగేషన్ శాఖ లో ఉత్తమ సేవలు అందించిన ఇమాన్యుయేల్, పేరయ్య లింగం, రేవు సుధాకర్ బాబు కుటుంబ సభ్యులను సన్మానించారు.



జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు , ప్రభుత్వ చీప్ విప్ చేర్ల జగ్గిరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్,  ఈ ఎన్ సి .. సి. నారాయణ రెడ్డి,  చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  ధవళేశ్వరం ఎస్ ఈ - నరసింహ మూర్తి,  ఐ సి ఐ డి సంస్థ వైస్ చైర్మన్ ప్రో.  ఎల్లారెడ్డి పలువురు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు హాజరయ్యారు.



అంతకు ముందు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక బ్యారేజ్ వద్ద ఉన్న సర్ అర్థర్ కాటన్ దొర, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి నది కి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్ పర్సన్ ఎమ్ షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా వాసిగా ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ కి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణం అన్నారు.  ఈ వేడుకలను రైతులు, మహిళలు, ఈ ప్రాంత ప్రజల మధ్య జరగడం చారిత్రాత్మక మైన ఘట్టంగా అభివర్ణించారు.

Comments