ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 1 (ప్రజా అమరావతి);
విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఆలయ చైర్మన్ శ్రీమతి సింహాచలం, ఈవో శ్రీమతి శిరీష.
శనివారం విశాఖపట్నం బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి కనకదుర్గమ్మ అమ్మవారి పేరున పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్, ఈవో సమర్పించారు. ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
addComments
Post a Comment