భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి సాదర వీడ్కోలు.
తిరుపతి, అక్టోబర్ 02 (ప్రజా అమరావతి):
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుగు పయనమైన గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వారికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావ్, ఏపీ హైకోర్టు జస్టిస్ లు మానవేంద్ర నాథ్ రాయ్, దుప్పాల వెంకట రమణ, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ కుల శేఖర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, చిత్తూరు గౌ. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమరావు, తిరుపతి థర్డ్ ఏ డి జె వీర్రాజు, జ్యుడీషియల్ ప్రోటోకాల్ అధికారి ధనుంజయ్ తదితరులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.
addComments
Post a Comment