రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);



రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాల


ని  జిల్లా కలెక్టర్ శ్రీ  కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను  ఆదేశించారు. 


మంగళవారం  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోబిక,  రామాయపట్నం పోర్టు  ఎం.డి శ్రీ ప్రతాప్ రెడ్డి లతో కలసి రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైన మొండివారిపాలెం, రావులవారిపాలెం గ్రామాలకు సంబంధించి నిర్మిస్తున్న ఆర్. అండ్ ఆర్ కాలనీని సందర్శించి, ఆర్ అండ్ ఆర్ కాలనీలో  చేపడుతున్న పునరావాస పనులను పరిశీలించారు.  చేపడుతున్న పునరావాస పనుల వివరాలు, ప్యాకేజీ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ పురోగతి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను  జిల్లా కలెక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీటి వసతి,  విద్య, వైద్యం తదితర వసతులతో  ఆర్. అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న పునరావాస పనులను  త్వరగా పూర్తి చేయాలని జిల్లా  కలెక్టర్,  అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు, అధికారులతో కలసి  పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి, పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోర్టు అధికారులకు సూచించారు. 

కలెక్టర్ వెంట రామాయపట్నం  పోర్టు లైజనింగ్ అధికారి శ్రీ ఐ.వి.రెడ్డి, భూసేకరణ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ శ్రీమతి పద్మావతి,  గుడ్లూరు తహసీల్దార్ శ్రీమతి లావణ్య తదితరులు పాల్గొన్నారు.


Comments