అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు.
ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కురువ సంఘాల ప్రతినిధులు.
కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించిన ప్రతినిధులు, తమ కులస్ధులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు సుంకన్న, శివలింగ, సోమలింగ, సాయిరామ్, మద్దిలేటి.
addComments
Post a Comment