విజయవాడ (ప్రజా అమరావతి); ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కొత్త సభ్య కార్యదర్శిగా శ్రీ ప్రవీణ్ కుమార్, ఐ.ఏ.ఎస్
ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కేంద్రీయ కార్యాలములో భాద్యతలు స్వీకరించారు. శ్రీ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కమీషనర్ మరియు డైరెక్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో తమ బాధ్యతలను నిర్వహింతున్నారు. ప్రస్తుతం ఉన్న భాద్యతలతోపాటు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బాధ్యతలను కూడా ఈరోజునుండి స్వవీకరించారు. అనంతరం ఆయన కాలుష్య నియంత్రణ మండలి లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులందరితో సమావేశము ఏర్పాటు చేసి కార్యాలము యొక్క విధులను తెలుసుకొని ప్రతి ఒక్కరు భాద్యతగా పనిచేసి సంస్థ యొక్క పేరును ఉన్నతస్థితిలో నిలపాలని కోరారు.
addComments
Post a Comment