ప్రజలు తమ ప్రభుత్వ పాలన పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు


నెల్లూరు, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్లిన ప్రజలు తమ ప్రభుత్వ పాలన పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నార


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం  ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. 


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్న  ముఖ్యమంత్రి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇదే తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనం అన్నారు. గతంలో గ్రామాలకు వెళ్లాలంటే ఎక్కడ ప్రజలు సమస్యలతో నిలదీస్తారేమోనని భయమేసేదని, ఇప్పుడు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. గ్రామాలకు సంబంధించి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ద్వారా లక్షలాది రూపాయల ఆర్థికలబ్దిని చేకూరుస్తున్నామని, ఈ గ్రామంలో కరుణాకర్ రెడ్డికి 5.40 లక్షలు, ఏడుకొండల కి 5.06 లక్షలు, సుధాకర్ కి రూ. 5.03 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సంక్షేమ పథకాల ద్వారా అందించామన్నారు. అర్హత ఒకటే ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో  నుడా వైస్ చైర్మన్ శ్రీ బాపిరెడ్డి, ఎంపీడీవో సుస్మిత, తాసిల్దారు నాగరాజు,  సర్పంచ్ శ్రావణి, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments