ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది


నెల్లూరు (ప్రజా అమరావతి)!

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. 

మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, తాళ్ళపూడి సచివాలయ  పరిధిలోని కప్పలదొరువు గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. తొలుత మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంను సందర్శించి  ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంతో   రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్నీ నియోజక వర్గాల్లో  వినూత్నంగా  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు  ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల  పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం  చేస్తున్నారని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజక వర్గానికి సంబంధించి   నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కింద అర్హత వున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని  అందించడం జరిగిందన్నారు.  సాంకేతిక కారణాలతో ఇంకా ఎవరికైనా నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ నగదు అందకపోతే  పరిశీలించి వారికి కూడా అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.  ఇటీవలే ఈ ప్రాంతంలో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి  ముఖ్యమంత్రి గారు శంఖుస్థాపన చేయడం జరిగిందని మంత్రి వివరించారు.  గ్రామాల్లో  మౌలిక వసతుల  కల్పనలో భాగంగా వివిధ  అబివృద్ది కార్యక్రమాలను చేపట్టుటకు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రజలు కోరిన   పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 


మంత్రి వెంట   ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, తహశీల్దార్ శ్రీ మనోహర్ బాబు,  ఎంపిడిఓ శ్రీమతి ప్రత్యూష, సర్పంచి శ్రీమతి మెట్టా వింద్యారెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments