అర్హతే ప్రామాణికంగా అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలను మంజూరు చేయడం జరుగుచున్నది


నెల్లూరు (ప్రజా అమరావతి);


అర్హతే ప్రామాణికంగా  అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలను  మంజూరు చేయడం  జరుగుచున్నద


ని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. 


గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కాగితాలపూరు పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత  90 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను, 72 లక్షలతో నిర్మించిన సైడు కాలువలను  మంత్రి   ప్రారంభించారు.  అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 

అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  అర్హత ఒక్కటే ప్రామాణికంగా  అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలను  మంజూరు చేయడం  జరుగుచున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా   ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని  మద్యవర్తుల ప్రమేయం లేకుండా వాటిని పరిష్కరించడంతో ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సుమారు 5 లక్షల రూపాయల పైబడి లబ్ధిపొందారని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో  త్రాగునీటి వసతి కల్పించేందుకు 74 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఈ రోజు కాగితాలపూరు గ్రామంలో  90 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను, 72 లక్షలతో నిర్మించిన సైడు కాలువలను  ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఒక కాగితాలపూరు గ్రామంలోనే గడిచిన 3 సంవత్సరాల కాలంలో 4.5 కోట్ల రూపాయలతో, మనుబోలు మండల పరిధిలో సుమారు 85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని మంత్రి వివరించారు. ప్రతి పేదవానికి అండగా వుంటూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,  నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments