కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రి రాక



*కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రి రాక*



తిరుపతి, డిసెంబర్24 (ప్రజా అమరావతి):  .కేంద్ర విద్యుత్తు మరియు పునరుత్పాదక విద్యుత్తు శాఖ సహాయ మంత్రివర్యులు ఆర్కే సింగ్ ఈ నెల  24, 25 తేదీలలో రెండు రోజుల  తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి శనివారం రాత్రి 7.55 గం. లకు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది.


రాష్ట్ర విద్యుత్తు అటవీ భూగర్భ గనుల శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్తు శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, ఎస్ ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు తదితరులు కేంద్రమంత్రి కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


Comments