ఈనెల 19వ తేదీన జిల్లాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పర్యటన

 ఈనెల 19వ తేదీన జిల్లాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పర్యటన*


*: గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో జరిగే యోగివేమన జయంతోత్సవాల్లో పాల్గొననున్న మంత్రి*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 18 (ప్రజా అమరావతి):


*ఈనెల 19వ తేదీన గురువారం జిల్లాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్  బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రకటనలోని సారాంశం  రేపటి రోజు  గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో జరిగే యోగివేమన జయంతోత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. గురువారం ఉదయం మదనపల్లి నుంచి బయలుదేరి 07:30 గంటలకు కదిరికి చేరుకుని కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం కదిరి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో జరిగే యోగివేమన జయంతోత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం భోజన విరామం తర్వాత కటారుపల్లి నుంచి బయలుదేరి నగరికి మంత్రి వెళ్లనున్నారు  పై ప్రకటనలో తెలిపారు



Comments