సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.


సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.



తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు.


సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే...


ఇక్కడికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు, అవ్వాతాతలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ. 


ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు.


హాజరైన డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను.

Comments