కర్నూల్ ఎయిర్పోర్టులో గవర్నర్కు స్వాగతం

 కర్నూలు ఎయిర్ పోర్ట్ (ప్రజా అమరావతి);



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ .బిశ్వ భూషణ్ హరి చందన్  నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం నెరవాడ మెట్ట ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో కర్నూలు ఎయిర్ పోర్ట్ కు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.


కర్నూలు  ఎయిర్ పోర్ట్ లో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఐజీ సెంథిల్ కుమార్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు  .గవర్నర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు.


అనంతరం  గవర్నర్  రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం నెరవాడ మెట్ట ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కు బయలుదేరి వెళ్లారు.



Comments