తెలుగు ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్.



*టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు*


*ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు*


*వర్ధంతి సభలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం:-*


తెలుగు ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్.


ఒక యుగపురుషునిగా, కారణ జన్ముడిగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్.

తెలుగు వారి ఆస్తి, తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్.

ఒక సాధారణ కుటుంబంలో పుట్టి...అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తి ఎన్టీఆర్.

ఒక వ్యక్తి ఒక రంగంలోనే రాణిస్తారు....కానీ ఎన్టీఆర్ అటు సినిమా రంగంలో..ఇటు రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు.

ఎన్టీఆర్ సినిమా రంగంలో పోషించిన పాత్రలు ఎవరూ పోషించలేరు. ఎంతో ఠీవీ, హుందాతనంతో ఎన్టీఆర్ నటన ఉండేది.

ఎన్టీఆర్ సినిమాలు అంటే వినోదమే కాదు...సందేశం కూడా ఉండేలా నిర్మించారు. 

నాడు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను.

అనురాగదేవత సినిమా షూటింగులో తొలిసారి ఎన్టీఆర్ ను కలిశాను.

నా తొలి భేటీలోనే ఆయన ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారు. 

ఒక సినిమా నటుడిగా వచ్చి....తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్.

ఈ ఏడాది తెలుగుదేశం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం.

ఎన్టీఆర్ స్ఫూర్తి భావితరాలకు కూడా ఆదర్శం. మీ పార్టీ సిద్దాంతం ఏమిటంటే సమాజమే దేవాలయం...ప్రజలే నా దేవుళ్లు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.

సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్.

అతిపెద్ద సంస్కరణ వాది ఎన్టీఆర్. ఆడబిడ్డల విద్యను ప్రోత్సహించాలని పద్మావతి యూనివర్సిటీ పెట్టారు. 

మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చింది కూడా ఆయనే. నేడు మహిళలు కూడా అన్ని రంగాల్లో రానిస్తున్నారు అంటే దానికి నాంది పలికి.. అమలు చేసింది ఎన్టీఆర్.

రాజకీయాల్లో పెత్తందారులు కాదు...చదువుకున్న వారిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చిన నేత ఎన్టీఆర్.

బిసిలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వడం కోసం 29 ఏళ్ల వయసులో యనమల రామకృష్ణుడు వంటి వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు.

బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ క్రియేటర్ సిఎంలలో అగ్రస్థానంలో ఎన్టీఆర్ ఉంటారు. అయితే ఇప్పుడు అతి పెద్ద విధ్వంసకులైన సిఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే.

సింగిల్ విండో విధానం, రెండు రూపాయలకే కేజీ బియ్యం వంటి పథకాలకు నాంది పలికింది ఎన్టీఆర్

తెలుగు గంగ, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి వంటి అనేక ఇరిగేషన్ పథకాలకు నాంది పలికిన నేత ఎన్టీఆర్.

ఇరిగేషన్ కు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేది. 2014 నుంచి 2019 వరకు రూ.64 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం.

72 శాతం పూర్తి చేసిన పోలవరాన్ని నేటి ముఖ్యమంత్రి గోదావరిలో కలిపేశాడు.

వ్యవసాయ రంగంతోనే భవిష్యత్ అని నాడు గుర్తించి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం టిడిపి.

తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే...తరువాత కాలంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా నేను పనిచేశాను.

సంస్కరణలతో ప్రజల జీవితాలు మార్చిన పాలన తెలుగుదేశం పాలన. నాడు ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం...ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకం అయ్యింది. నాడు మహిళలకు ఇచ్చిన ఆస్థి హక్కు ఇప్పుడు దేశంలో చట్టం అయ్యింది.

బడుగు వర్గాలకు దేశంలో తొలిసారి గురుకుల పాఠశాలలు పెట్టింది టిడిపి. ఇప్పుడు అవే హాస్టల్స్ గా మారిన పరిస్థితి.

అయితే ఇప్పుడు స్కూళ్లకు రంగులు వేసిన ఈ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు

ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనం కారణంగా 4 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు.

ఎన్టీఆర్ మనకు గట్టిగా ప్రశ్నించే విధానాన్ని, చైతన్యాన్ని అందించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. 

ఇప్పుడు మన పర్యటలను అడ్డుకుంటున్న ప్రభుత్వాన్ని మనం అంతే గట్టిగా ప్రశ్నించాలి. మనం మీటింగ్ లు పెట్టుకుంటే ఎందుకు పోలీసుల భద్రత ఇవ్వడం లేదు.?

కందకూరులో అంత మంది జనం వస్తే పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు..?

ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనం మన సభలకు తరలివస్తున్నారు. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 1 తెచ్చి మనల్ని అడ్డుకుంటున్నారు. 

మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది...దాన్ని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉంది..?

ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పిలుపునిస్తున్నా...ప్రతి కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తున్నా.

నాకెందుకు రాజకీయం అని ఎన్టీఆర్ నాడు అనుకుని ఉంటే ఏమయ్యేది..? ప్రజలు అంతా ఆలోచించాలి.

పేదవర్గాలను అదుకునేందుకు ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి.

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత బిసిల సబ్ ప్లాన్ నిధులు ఏం చేస్తున్నారు.?వారి కోసం ఖర్చుచేయాల్సిన నిధులను మళ్లించారు.

సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం సమభాగంలో ఉంటేనే సుస్థిర అభివృద్ధి. 

తిరుమలలో నాడు భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్...దానిని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెట్టాను.

పేదలకు అన్నా క్యాంటీన్ పెట్టడం తప్పా.? పేద విద్యార్థుకలు విదేశీ విద్య అవకాశాలు కల్పిస్తే తప్పా.? ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది..?

సంక్షేమాన్ని పక్కన పెట్టి...ఈ ప్రభుత్వం బాదుడే బాదుడు...ప్రజలపై వీర బాదుడు బాదేస్తోంది. 

అవినీతిపై టిడిపి కఠినంగా ఉండేది....కానీ జగన్ వచ్చిన తరువాత అవినీతిని కేంద్రీకరణ చేశాడు.

మద్యం, ఇసుక ఆదాయం అంతా జగన్ దగ్గరకే రావాలి. సాయంత్రం అయితే జగన్ అవినీతి సొమ్ము లెక్కించుకుంటున్నాడు.

పేదల రక్తం తాగే జలగ ఈ జగన్ మోహన్ రెడ్డి...మద్యం అమ్మకాల్లో నీ సొంత బ్రాండ్లు ఎందుకు అని ప్రశ్నించాం...కానీ జగన్ మారలేదు.

నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా జగన్ రెడ్డికి పట్టడం లేదు.

పుంగనూరులో రౌడీ రాజకీయం చేస్తున్నారు. వైసిపి తప్పులను ప్రశ్నించిన టిడిపి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 

మొన్న జరిగిన ఘటనలో చదువుకుంటున్న విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు.

మైనారిటీ యువకులను జైల్లో తీవ్రంగా హింసించారు. దెబ్బలు కనపడకుండా కొట్టి టిడిపి కార్యకర్తలను దారుణంగా హింసించారు.

పోలీసులు ఇంత రాక్షసంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదు.తమ బిడ్డలపై జరిగిన హింసపై మైనారిటీ మహిళల బాధలు చూస్తే గుండె తరుక్కుపోయింది.

రాష్ట్రంలో ఈ తరహా పోలీసు టార్చర్ ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోంది.

ఎన్టీఆర్ నాడు భయపడి ఉంటే రాజకీయ పార్టీ పెట్టేవారు కాదు. ఆయనపైనా నాడు కేసులు పెట్టారు. అయినా ఎదిరించి నిలబడ్డారు.

•రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది.

రాష్ట్రంలో రూ.500 నోట్లు కనిపించడం లేదు. ఆ నోట్లు అన్నీ జగన్ దాచేస్తున్నాడు

డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి అని జగన్ చూస్తున్నాడు కానీ  డబ్బుతో జగన్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదు.

ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరును తొలగించిన సిఎం...వైఎస్ ఆర్ యూనివర్సిటీ అని పెట్టాడు.

నాడు నేను అనుకుంటే కడపలో ఉన్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు తీసేసే వాడిని కదా. కానీ  మేము అలా వ్యవహరించలేదు.

ప్రజా వేదిక కూల్చినప్పుడే  జగన్ ను ప్రజలు ప్రశ్నించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు.

ప్రజలు ప్రభుత్వ తప్పిదాలను పశ్నించాలి....కార్యకర్తలు పార్టీ కోసం పునరంకితం కావాలి.

ఎక్కడ తెలుగు జాతి ఉంటే అక్కడ తెలుగుదేశం ఉంటుందనేది అంతా తెలుసుకోవాలి.

ఎన్టీఆర్ ఆశించిన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి. అందుకు కోసం సైకో పాలన పోవాలి...సైకిల్ పాలన కావాలి

రేపు జరిగే ఎన్నికలు చాలా కీలకం....వచ్చే ఎన్నికల్లో జగన్ ఒక పక్క...5 కోట్ల ప్రజలు ఒక పక్క

ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించడం అంటే...ఆయన ఆశయ సాధనకు పనిచేయడమే.

భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు...బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవ చేస్తున్నారు. ఎన్టీఆర్, బసవతారకం పేరున సేవ చేయడం అభినందనీయం.

Comments