కేంద్ర మంత్రులతో సమావేశమైన మంత్రి బుగ్గన.




అమరావతి (ప్రజా అమరావతి);


 ఢిల్లీలో రెండో రోజు  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన.


కేంద్ర మంత్రులతో సమావేశమైన మంత్రి బుగ్గన.






కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, స్టీల్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.


కేంద్ర రవాణా, పౌర విమానయాన శాఖ మంత్రి వీ.కే సింగ్.



కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి  రాజ్ కుమార్ సింగ్.


కేంద్ర సివిల్ ఏవియేషన్, స్టీల్ శాఖ జ్యోతిరాదిత్య ఎం సిందియా.


మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో కలిసి ఆహ్వానం పలికిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.


రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ ల మంజూరు, తిరుపతి విమానాశ్రయం ఎంఆర్వో ఏర్పాటు సహా పలు , విద్యుత్ సంబంధిత ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అమర్ నాథ్ లతో పాటు హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఐ.టీ , నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ , పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్.

Comments