శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): ఈరోజు KPHB కాలనీ, హైదరాబాద్ కు చెందిన నాదేళ్ళ సుధారాణి మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలoకారం నిమిత్తం 178 గ్రాములు బరువు గల బంగారు కాసుల పేరును మరియు పటమటలంక, విజయవాడకు చెందిన చెన్నుపాటి కోటేశ్వరమ్మ 41 గ్రాములు బరువు గల బంగారు తామరపువ్వు ను ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ కె. వి.ఎస్ కోటేశ్వరరావు గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment