రామచంద్రపురం
ఫిబ్రవరి 4 (ప్రజా అమరావతి);
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం దాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనందదాయక మని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి కల్యానోత్సవం లో భాగంగా నాలుగోవ రోజు నూతనంగా నిర్మించిన రథం పై స్వామిఅమ్మవారిని ఆశీనులు చేసి హారతి ఇచ్చి రథం లాగి ఊరరేగింపు లో మంత్రికుటుంబ సమేతం గా పాల్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ఇందులో భాగంగానే జీర్ణోద్ధరణకు వచ్చిన స్వామివారి పాత రథం స్థానే నూతన రథం నిర్మించడానికి సంకల్పించినట్లు తెలిపారు.
నూతన రథం నిర్మాణం కోసం కంచి కామకోటి పీఠాధి మఠం, విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నంద స్వామి ఆశీస్సులతో 45 రోజుల క్రితం నూతన రథం పనులు ప్రారంభించి రికార్డు స్థాయిలో స్వామివారి కల్యాణ సమయానికి నూతన రధం నిర్మించుకోవడం శుభ పరిమాణంగా మంత్రి తెలిపారు.
నూతన రథములో స్థల పురాణములో తెలిపిన విధముగా స్వామి వారి దేవాలయంలో ఉన్న వివిధ విగ్రహాల సంబంధించిన చిత్రాలను నూతన రథంలో
రథ రూపశిల్పి గణపతాచార్యులు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. నూతన రథం ప్రారంభోత్సవములో విశాఖపట్నం శారదా పీఠం పీఠాధిపతి స్వాత్మా నంద స్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి లతోపాటు దేవాదాయ శాఖకు చెందిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment