వెనిగండ్ల రాము సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్న నూజెళ్ల, చిరిచింతల గ్రామాల ప్రజలు

 *- వెనిగండ్ల రాము సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్న నూజెళ్ల, చిరిచింతల గ్రామాల ప్రజలు


*

 *- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎన్నారై వెనిగండ్ల*

 *- కష్టపడి పని చేసే వారికి టీడీపీలో సముచిత స్థానం*

 *- బాబు వస్తేనే జాబు వస్తుందన్న వెనిగండ్ల రాము*



 గుడివాడ మార్చి 28 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము సమక్షంలో గుడివాడ రూరల్ మండలం నూజెళ్ళ, చిరుచింతల గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వెనిగండ్ల రాము కార్యాలయంలో దాదాపు 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి వెనిగండ్ల రాము కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరితో వెనిగండ్ల రాము మాట్లాడారు. పలువురు మహిళలు వైసిపి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గుడివాడ రూరల్ మండలం నూజెళ్ల, చిరిచింతల గ్రామాలకు చెందిన 50 మంది గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో చేరారని, వీరందరికీ పార్టీలో సముచితస్థానం ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారని, ఇది శుభ పరిణామమని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి మహిళలే అండగా ఉంటూ వస్తున్నారని గుర్తు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నానని, మహిళలు పెద్దఎత్తున పాల్గొంటూ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. యువత కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులవుతున్నారని తెలిపారు. బాబు వస్తేనే జాబు వస్తుందని వారంతా బలంగా నమ్ముతున్నారని చెప్పారు. యువత కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ గుత్తా చంటి, టిడిపి నాయకులు చిట్టిబాబు, అడుసుమిల్లి లక్ష్మణరావు, గోగుళ్ళమూడి నాగరాజు, టి రామకృష్ణ, సింగవరపు కిషోర్, సింగవరపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments