హైదరాబాద్ (ప్రజా అమరావతి);
*నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ, ఎపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలు*
*సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం*
• 41 ఏళ్ల క్రితం రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు ఈ రోజు
• తెలుగు జాతి రుణం తీర్చుకోవాలి అని ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు.
• పార్టీ ఆవిర్భావం పై ప్రకటన చేయాలనే ప్రతి పాదన ఆరోజు లేదు...అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జనసందోహంలో అప్పటికప్పుడే పార్టీ ప్రకటించారు.
• తెలుగు జాతి కోసం పార్టీ పెడుతున్నా...దాని పేరే తెలుగు దేశం అని ఎన్టీఆర్ అన్నారు.
• తెలుగు దేశం పుట్టింది తెలుగు జాతి ఆత్మగౌరవం నుంచే
• తెలుగు జాతిని ఉద్దరించడానికే ప్రతి నిర్ణయం తీసుకున్న నేత ఎన్టీఆర్
• ఎన్టీఆర్ ను మీ సిద్దాంతం ఏంటి అన్నారు... .హ్యూమనిజమే నా సిద్దాంతం అని ఎన్టీఆర్ అన్నారు.
• పసుపు రంగును పార్టీ రంగుగా మార్చారు. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఉంటుంది
• నాగలి, చక్రం, పూరిల్లు చిహ్నంగా ఎన్టీఆర్ పార్టీ చిహ్నం రూపొందించారు.
• తెలుగు జాతి చరిత్ర...తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు...ఆవిర్భావం తరువాత అని చూడాల్సి ఉంది.
• ఒకప్పుడు ప్రభుత్వం అంటే పెత్తందారీ వ్యవహారం, దళారీ వ్యవస్థ. ఎన్టీఆర్ వచ్చాక వీటన్నింటీనీ మార్చారు.
• భారత దేశంలో సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికిన పార్టీ తెలుగు దేశం పార్టీ.
• నేను సవాల్ చేసి చెపుతున్నా...ఆహార భద్రత కోసం నాడే రూ.2 కిలోబియ్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్
• ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకాలు అమలు చేస్తున్నారు.
• సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. మాండలిక విధానం తీసుకువచ్చి...అధికార వికేంద్రాకరణ చేసిన నాయకుడు ఎన్టీఆర్
• తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వారు ఎన్టీఆర్
• చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి అని డాక్టర్లు, ఇంజనీర్, లాయర్, పట్టభద్రులను రాజకీయాల్లోకి తెచ్చిన నాయకడు ఎన్టీఆర్
• పేదల జీవితాలుమారాలి అంటే చదువు చాలా ముఖ్యం అని...దేశంలో మొట్టమొదటి సారి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్
• మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు..వారికి విద్య అందాలని వినూత్న కార్యక్రమాలు చేశారు.
• ఒకప్పుడు ఆడపిల్లలను చదవించేవారు కాదు...అయితే ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్
• మహిళలకు ఆస్థి హక్కు ఇచ్చింది ఎన్టీఆర్.
• వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రధాన్యం ఇచ్చారు....వారికి స్థానిక సంస్ధల్లో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. నేను వచ్చిన తరువాత వాటిని 34 శాతం చేశాను.
• బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెచ్చిన పార్టీ తెలుగు దేశం
• ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. మే 28 యుగపురుషుడు పుట్టి 100 ఏళ్లు అవుతుంది.
• ఈ సందర్భంగా తెలుగు జాతికి ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి శతజయంతిని ఘనంగా నిర్వహించాలి
• శతజయంతి సందర్భంగా రానున్న రెండు నెలల్లో 100 చోట్ల శతజయంతి ఉత్సవాలు జరగాలి.
• వచ్చే మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. అప్పటికి 100 చోట్ల శతజయంతి కార్యక్రమాలు చేయాలి
• తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్లమెంట్ లలో శతజయంతి కార్యక్రమాలు చేస్తాం.
• తెలుగు జాతి గర్వపడేలా అన్న శతజయంతి ఉత్సవాలు
• ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 వెండి నాణెం విడుదలకు కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
• తెలుగు దేశం పార్టీకి ఎప్పుడూ స్పష్టమైన విజన్ ఉంది.
• 90 లలో ఆర్థిక సంస్కరణలు, ఇంటర్ నెట్ విప్లవం వచ్చాయి. దీనిపై ఆలోచన చేసి నాడు విజన్ 2020 తయారు చేశాం
• 20 ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజ్ లు పెంచాం
• నాడు నేను విజన్ గురించి చెపితే చాలా మంది నమ్మలేదు.
• నాడు నా మాట విని చదువుకున్న వారు నేడు కోటీశ్వరులు అయ్యారు. ప్రపంచంలో మేటి అయ్యారు.
• నాడు విద్యుత్, ఎయిర్ పోర్ట్ లు, టెలికమ్యూనికేషన్ లలో సంస్కరణలు చేశాం.
• ఒక్క హైటెక్ సిటీ నాడు ప్రారంభించాం. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో చూడండి.
• 25 ఏళ్లకు ముందు హైదరాబాద్ ఎలా ఉంది...నేడు నెలా ఉంది.
• ఒక్క ఐటీ రంగమే కాదు....డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించాం
• ఆడవాళ్లు ఒకరిపై ఆధారపడే అవకాశం లేకుండా డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాం
• నాడు ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను తీసుకువచ్చి వారి సామర్థ్యం నిరూపించాం
• ఆర్థిక సంస్కరణల ద్వారా దేశానికి దశా దిశా మార్చిన వ్యక్తి పివి నరసింహారావు.
• నాడు పివి చేసిన సంస్కరణల కు అనుగుణంగా నేను సంస్కరణలు తెచ్చాను.
• నేను విజన్ అంటే దాన్ని 420 అన్నారు..ఆ 420 అన్నవాళ్లు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు
• నాడు ఫోన్ లగురించి మాట్లాడితే హేళన చేశారు...ఇప్పుడు ఆ సెల్ ఫోన్ అనేక పనులకు సాధనం అయ్యింది.
• నేను సెల్ ఫోన్ లు కనిపెట్టలేదు. నేను నాడు ఇచ్చిన నివేదకను ఆధారంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ సెక్టార్ లో వాజ్ పేయి మార్పులు చేశారు.
• నాటి నా ప్రతిపాదనలను వాజ్ పేయి అమలు చేయడం వల్లనే సెల్ ఫోన్ లు చేరువ అయ్యాయి.
• దేశంలో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్. దాన్ని తెచ్చింది మనమే. ఓపెన్ స్కైపాలసీ తీసుకువచ్చింది మనమే
• పవర్ సెక్టార్ లో మొదటి ప్రైవేటు పవర్ ప్లాంట్ మన రాష్ట్రంలో వచ్చింది
• గోల్డెన్ క్వార్డిలేటరల్ రహదారులు రావడానికి కూడా టీడీపీ కారణం
• ప్రతిపక్షంలో ఉన్నా....అధికారంలో ఉన్నా నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ.
• కలలు కనండి..వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అని యువతను ప్రోత్సహించాను
• రాష్ట్రంలో ప్రతి చోటా స్కూళ్లు, కాలేజ్ లు పెట్టి విద్యను అందించాం. ఎపిని మానవ వనరుల కేంద్రంగా మార్చాం.
• మన అభివృద్ది నమూనాగా హైదరాబాద్ నిలిచింది.
• ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించింది ఎన్టీఆర్
• ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా జ్యూయిష్ జాతి ఉంది. వారిని తెలుగు జాతి అధిగమించాలి అని నేను కోరుకుంటున్నా
• 2047కు భారత దేశం అగ్రస్థానంలో ఉండాలి. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి అని ప్రధానిని కోరాను.
• ప్రపంచం లో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి అనేది నా కోరిక.
• విభజన సమయంలో రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాలి అని కోరిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ
• రెండూ రెండు కళ్లు అని తెలుగు జాతి గురించి ఆలోచించిన పార్టీ తెలుగు దేశం
• నాడు నేను కట్టిన హైటెక్ సిటీని తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూల్చేసి ఉంటే నేడు హైదరాబాద్ అభివృద్ది జరిగేదా.
• నేను తెచ్చిన రింగ్ రోడ్, జీనోం వ్యాలీ లను నిలిపివేసి ఉంటే కోవిడ్ కు వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి ఉండేదా?
• నా తరువాత అభివృద్ది కొనసాగించిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని అభినందిస్తున్నా
• ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్ నేనే తెచ్చాను అని మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు....కానీ నాకు ఎప్పుడూ ఆ తృప్తి ఉంటుంది.
• నాకు ఓట్లు పడకపోవచ్చు.....నేను ఓట్లకోసం పని చేయ్యలేదు. తెలుగు జాతి కోసం పనిచేశాను
• ఇంజనీరింగ్ కాలేజీలు రావడానికి చంకలో ఫైళ్లు పెట్టుకుని డిల్లీలో తిరిగా.
• మంచి ఐటీ కంపెనీలు రావాలి అని బిల్ గేట్స్ వంటి వారిని కలిసి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకువచ్చాను.
• దేని కోసం మైక్రోసాఫ్ట్ తెచ్చాను...ఆ కంపెనీ ఊరికే రాలేదు. ఇతనికి ఇవ్వకపోతే లాభం లేదని బిల్ గేట్స్ తన కంపెనీ ఇక్కడ పెట్టాడు
• ఐఎస్బి సంస్థ హైదరాబాద్ రావడానికి...స్వయంగా వారికి మర్యాదలు చేసి పట్టుపట్టి సాధించాను.
• ఈ రోజు ఎపిలో పరిస్థితి దారుణంగా ఉంది. జగన్ ను సైకో అనాలా....విధ్వంసకారుడు అనాలా
• తెలుగు జాతి గర్వపడేలా అమరావతి ప్రారంభించాను. నాకోసం హైటెక్ సిటీ తెచ్చానా...నా కోసం అమరావతి కట్టానా
• రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇస్తే....దాన్ని నాశనం చేశారు.
• నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర భూములు కొనుక్కొండి అని చెప్పాను. ప్రజలు లబ్ది పొందారు.
• ఎపిలో నాలుగేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేదు. ఎపిలో రాజధాని అంటే మూడు ముక్కలాటగా మారింది.
• రాజధాని లేని రాష్ట్రం చేసినందుకు ప్రతి తెలుగు వాడూ బాధపడాలి
• 7 ఏళ్ల క్రితం ఇదే రోజున పట్టిసీమను జాతికి అంకితం చేశాను.
• దేశంలో తొలి సారి పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేశాం.
• ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు సాగునీరు అందింది. తద్వారా రాయలసీమ రైతులకూ నీరు అందింది.
• గోదావరి, కృష్ణా నదుల నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశామలం అవుతాయి.
• ఎపిలో విభజన కంటే...జగన్ సైకో వల్ల ఎక్కవ నష్టం జరిగింది
• ఎపిలో ఇప్పుడు గన్ కల్చర్...గంజాయి కల్చర్.
• మొన్నటి వరకు గొడ్డళ్లు...ఇప్పుడు ఎపిలో గన్ కల్చర్ వచ్చింది
• అయితే ఇప్పుడు ఏపిలో ప్రజల నుంచి తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి బుద్దిచెప్పారు.
• వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తిరుగుబాటు కనిపిస్తుంది.టీడీపీ అధికారంలోకి వస్తుంది.
• తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం రావాలి. ఇక్కడ తెలుగు దేశం పార్టీ చారిత్రక అవసరం.
• ఎపిలో పునర్ నిర్మాణం జరగాలి.
• నేడు తెలుగు జాతి ప్రజలు గ్లోబల్ సిటిజన్స్ గా ఉన్నారు.
• 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో అగ్రగామి జాతిగా ఉండాలి
• నేడు 12 శాతం జనాభాకు రోజుకు రూ.150 మాత్రమే ఆదాయం
• 22 శాతం జనాభాకు రోజుకు ఆదాయం రూ.350 మాత్రమే
• 1 శాతం ప్రజలు దగ్గరే 63 శాతం సంపద ఉంది.
• పేద వాడికి అండగా ఉంటా....పేదరిక నిర్మూలన చేసేవరకు విశ్రమించను. ఇదే నా సంకల్పం.
• మేధావులు, డబ్బులు ఉన్నవారు, సంపద ఉన్నవారు నిరుపేదలకు అండగా ఉండాలి
• టీడీపీ వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి...వాటితో పాటు అభివృద్ది కూడా చేస్తాం. సంపద సృష్టించి పేదలకు ఆ సంపద అందిస్తాం.
• సంక్షేమంతో పాటు అభివృద్ది ప్లస్ అనేది ఆలోచన. అంటే ఏం చేస్తే పేదల ఆదాయం పెరుగుతుందో అది చేస్తా
• నాడు జన్మభూమి అనే స్లోగన్ ఇస్తే అంతా తరలి వచ్చారు. అభివృద్దిలో భాగస్వాములు అయ్యారు.
• 10 కోట్ల జనాభా కలిగిన తెలుగు జాతి. ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలి. ఆర్థిక అసమానలతను మార్చేలా ప్రతి ఒక్కరు పని చేయాలి. ఇందుకు నేడు నాంది కావాలి
• ప్రతి ఇంటికి విజన్ ఇస్తాం...ప్రజలకు ఏడాదికి ఏం చేస్తాం...5 ఏళ్లకు ఏం చేస్తాం...10 ఏళ్లకు ఏం చేస్తాం అనేది చెపుతాం
• పేదలను ఆదుకున్నప్పుడే ధనికులకు కూడా తృప్తి వస్తుంది.
• పేదల జీవితాల్లో మార్పులు తెచ్చి చూపిస్తాం
• సంపద సృష్టించడమే కాదు...ఆ సంపద పేదలకు చేరేలా చేస్తాం
• మేథావులు, ప్రజలు రాజకీయాల గురించి ఆలోచించాలి. రాజకీయాలు నాకెందుకు అని ప్రజలు అనుకోకూడదు.
• ప్రజల జీవితాలను మార్చేది రాజకీయం, ప్రభుత్వ పాలసీలు. ప్రజలు రాజకీయం మాకెందుకు అనుకోకుండా మంచి వారిని రాజకీయాల్లో ప్రోత్సహించాలి
• దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి..అంతా డిజిటల్ గామార్చాలి.
• ప్రజలు తెలుగుదేశాన్ని ప్రోత్సహించాలి. నేరుగానో,సోషల్ మీడియా ద్వారానో టీడీపీకి సహకరించాలి. వీటితో పాటు తెలుగు దేశం పార్టీకి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలి అని కోరుతున్నా
• ప్రతి ఒక్కరు రూ.5 వేలు ఇస్తే టీడీపీ శాశ్విత సభ్యత్వం ఇస్తాం
• ప్రజలతో పార్టీ నడపాలి అనేది నా సంకల్పం...అందుకే విరాళాలు కోరుతున్నా.
• మన పార్టీ వల్ల ఫలితాలు పొందిన వారు టీడీపీకి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి.
• ఇంటింటికీ తెలుగు దేశం తెలంగాణలో బాగా జరుగుతుంది.
• రానున్న రోజుల్లో తెలంగాణ లో టీడీపీకి పూర్వవైభవం ఖాయం
• తెలుగు జాతికి మూడు అంశాలు. 2047కు తెలుగు జాతి గ్లోబల్ లీడర్ కావాలి. తెలుగు జాతి ఒకటే కుటుంబంగా ముందుకు సాగాలి. కులం, మతం,ప్రాంతం అనే అంశాలకు అతీతంగా ఆయా వర్గాలకు చేయూతను ఇవ్వాలి.
• తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు దేశం ఉంటుంది, ఎన్టీఆర్ ఉంటారు.
• తెలుగు జాతి ఎక్కడ ఉన్నా కలిసి నడుద్దాం...కలిసి అభివృద్ది సాదిద్దాం. మంచి సంకల్పంతో ఒకరికి ఒకరు అండగా ఉంటే విజయం సాధిస్తాం.
• ఎన్నిఇబ్బందులు, కష్టాలు వచ్చినా తెలుగు దేశం జెండా మోసే నా టీడీపీ కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారాలు తెలుపుతున్నా.
addComments
Post a Comment