లోకేష్ పలకరింపుతో పులకరించిన దళిత రైతు కుటుంబం.

 *లోకేష్ పలకరింపుతో పులకరించిన దళిత రైతు కుటుంబం



 జంబులదిన్నె (ప్రజా అమరావతి);


యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత క్యాంప్ సైట్ సమీపంలో యువనేత నారా లోకేష్ కు ఓ పొలంలో వన్నూరప్ప, నారాయణమ్మ దంపతులు పనిచేస్తూ పనిచేస్తూ కనిపించారు.

వారివద్దకు వెళ్లి వారు పండిస్తున్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్.

వాళ్ళు పండిస్తున్న పంటలు, పెట్టుబడి, డ్రిప్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


*రైతు వన్నూరప్ప మాట్లాడుతూ..*


- సార్ నాకు రెండు ఎకరాల పొలం ఉంది.

- 16 నెలల క్రితం చీనీ పంట వేశాను.

- అంతర పంటగా ఎకరం పొలంలో వేరుశనగ, మరో ఎకరంలో బెండ పంటలు 20 రోజుల క్రితం వేశాను.

- 20రోజులకే రూ.60వేలు బెండ పంటకు ఖర్చు అయ్యింది.

- ప్రభుత్వాన్ని డ్రిప్ అడిగాను. సబ్సిడీ లేదన్నారు. నా పొలానికి సరిపడా డ్రిప్ కి రూ.45వేలు అవుతుందన్నారు.

- బయటి మార్కెట్ లో రూ.40వేలకు డ్రిప్ కొని పొలంలో వేసి పంటలు పండిస్తున్నాను.

- నేను దళితుడిని. పొలం కొనుగోలు, ఉచిత బోర్లు, సబ్సిడీ పథకాలు ఏమీ అందించడం లేదు.

- పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి.

- ప్రకృతి విపత్తులు వస్తే తీవ్రంగా నష్టపోతున్నాం.

- చీనీ పంట మద్దతు ధరలు పంట చేతికొచ్చే సమయంలో అమాంతం తగ్గిపోతోంది.

- కూలి ఖర్చులు పెరగడం వల్ల నేను, నా భార్య కష్టపడి పంట పండించుకుంటున్నాం.


*నారా లోకేష్ స్పందిస్తూ...*


- తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే రైతులను ఆదుకుంటాం.

- 100 శాతం సబ్సిడీపై ఎస్సీ రైతులకు డ్రిప్  అందిస్తాం.

- గతంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు అందిస్తాం.

- చీనీ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ధరలు పెంచి, లాభాలు వచ్చేలా చేస్తాం.

- పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం.



Comments