4742 మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలు.

 


*4742 మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలు



పార్వతీపురం, మే 19 (ప్రజా అమరావతి): జిల్లాలో 4742 మంది వాలంటీర్లు సేవా పురస్కారాలు అందుకున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు అలజంగి జోగారావు, విశ్వసరాయి కళావతి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలో 312 గ్రామ, 38 వార్డు సచివాలయాలు వెరసి 350 ఉండగా 4947 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో, 676 మంది పట్టణ స్థాయిలో వెరసి 5623 పోస్టులు ఉండగా 4851 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో, 643 మంది పట్టణ స్థాయిలో వెరసి 5494 మంది పనిచేస్తున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 4030 మందికి సేవా మిత్ర, 75 మందికి సేవా రత్న, 17 మందికి సేవా వజ్ర పురస్కారాలు లభించాయి. పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 603 మందికి సేవా మిత్ర, 15 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర పురస్కారాలు లభించాయి. 4633 మందికి సేవా మిత్ర, 90 మందికి సేవా రత్న, 19 మందికి సేవా వజ్ర వెరసి 4,742 మందికి పురస్కారాలు లభించాయి.


*కురుపాం నియోజక వర్గంలో కొమరాడ మండలంలో* 220 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 227 మందికి పురస్కారాలు లభించాయి. *గుమ్మలక్ష్మిపురం మండలంలో* 291 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒకరికి సేవా వజ్ర వెరసి 297 మందికి పురస్కారాలు లభించాయి. *కురుపాం మండలంలో* 236 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 241 మందికి పురస్కారాలు లభించాయి. *జియ్యమ్మ వలస మండలంలో* 251 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 258 మందికి పురస్కారాలు లభించాయి. *గరుగుబిల్లి మండలంలో* 225 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 230 మందికి పురస్కారాలు లభించాయి.


*పాలకొండ నియోజక వర్గంలో వీరఘట్టం మండలంలో* 373 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 379 మందికి పురస్కారాలు లభించాయి. *సీతంపేట మండలంలో* 317 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 323 మందికి పురస్కారాలు లభించాయి. *భామిని మండలంలో* 222 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 227 మందికి పురస్కారాలు లభించాయి. *పాలకొండ మండలంలో* 244 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 251 మందికి పురస్కారాలు లభించాయి. *పాలకొండ పట్టణంలో* 138 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 144 మందికి పురస్కారాలు లభించాయి.


*పార్వతీపురం నియోజక వర్గంలో పార్వతీపురం మండలంలో* 318 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 323 మందికి పురస్కారాలు లభించాయి. *సీతానగరం మండలంలో* 292 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 299 మందికి పురస్కారాలు లభించాయి. *బలిజిపేట మండలంలో* 353 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 360 మందికి పురస్కారాలు లభించాయి. *పార్వతీపురం పట్టణంలో* 238 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 244 మందికి పురస్కారాలు లభించాయి.


*సాలూరు నియోజక వర్గంలో మక్కువ మండలంలో* 287 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 294 మందికి పురస్కారాలు లభించాయి. *సాలూరు మండలంలో* 186 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 193 మందికి పురస్కారాలు లభించాయి. *పాచిపెంట మండలంలో* 215 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 220 మందికి పురస్కారాలు లభించాయి. *సాలూరు పట్టణంలో* 227 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 232 మందికి పురస్కారాలు లభించాయి.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించుటకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని అన్నారు. పరిపాలన పకడ్బందీగా క్షేత్ర స్థాయిలో చేరుటకు చక్కని వ్యవస్థ అని చెప్పారు. అవినీతి లేని, పారదర్శకంగా పథకాలు చేర్చుతున్నారని ఆయన కొనియాడారు. కరోనాలో అధ్భుత సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం పని చేస్తున్నారని ఆయన వివరించారు. అర్హులని గుర్తిస్తూ పథకాలు అందేవిధంగా మీరు తోడ్పాటును అందిస్తున్నారని, సేవాభావానికి, మానవత్వానికి మారు పేరుగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెల్లవారక ముందే పింఛను ఇంటికి వెళ్ళి అందిస్తూ సేవా నిరతిని చాటుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 


శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాలంటీర్లు పట్ల ప్రేమ మమకారం ఉన్నాయన్నారు. సేవ చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకు మంచి అవకాశం కల్పించిందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని సేవలు అందించాలని ఆమె కోరారు. 


శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించుటకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవస్థ కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో కూడా వివరించడం జరిగిందన్నారు. వాలంటీర్ లు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం జరిగే స్థాయికి ఎదిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వానికి కళ్ళు, చెవులుగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు క్షణాల్లో చేరుటకు, సమాచారం చేరవేయడానికి వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అన్నారు. వాలంటీర్లు సేవా పురస్కారాలకు రూ.5 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. 


ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ బి. గౌరీశ్వరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సచివాలయాల నోడల్ అధికారి కె. రామచంద్ర రావు, మునిసిపల్ కమీషనర్ జె. రామ అప్పల నాయుడు, పార్వతీపురం ఎం.పి.పి మజ్జి శోభా రాణి, జెడ్పీటీసీ రేవతమ్మ, బలిజిపేట, సీతానగరం మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image