కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించేవిధంగా అన్ని చర్యలు



ఇరగవరం, మే 06 (ప్రజా అమరావతి);


 *కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించేవిధంగా అన్ని చర్యలు


తీసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియో గదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరరావు అన్నారు*...


  శనివారం ఇరగవరం  మండలం  లోని పలుగ్రామాలలో పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు.

 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అకాల వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, వర్షాలవల్ల కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.  కృష్ణాజిల్లా నుండి 10 లక్షల గోనె సంచులు వస్తున్నాయని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే తరలించే విధంగా  రైతులు ఆనందంగా ఉండే విధంగా చర్యలు తీసు కున్నామని  అయన తెలిపారు.  రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు  మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు సంబంధం లేదనే విషం తెలియక, ఇంకా రైతులు అపోహ పడుతు న్నారని అన్నారు.  రైతులు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవలసిన అవసరం లేదన్నారు.  కొంతమంది మిల్లర్లు రైతులకు ఫోన్ చేసి  నూక అవుతుంది మిల్లుకు రావాలని పిలుస్తున్నారనే  ఫిర్యాదు వస్తే అట్టి మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు .అకాల వర్షంతో   రైతుల వద్ద  ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  దళారీలు లేకుండా  ప్రతి రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర రూ 1530 రూపాయలు రైతుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు .  రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు, మిల్లర్లకు దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకున్న  చర్య అతి ముఖ్యమైనదని ఆయన అన్నారు.  

 దాన్యం తరలించేటప్పుడు రైతులు   రవాణా చార్జీలు రైతు పెట్టుకున్నట్లైతే  వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు. 


 ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్ , స్థానిక నాయకులు,  రైతులు, తదితరులు పాల్గొన్నారు.




Comments