అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధి బృందం.
అల్లూరి సీతారామరాజు పేరును నూతనంగా ఏర్పాటైన జిల్లాకు పెట్టడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధులు, అంతేకాక క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేసి పేద క్షత్రియులను ఆదుకుంటున్నందుకు వారి తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్న ప్రతినిధులు. ఇప్పటివరకు సేవాసమితి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఏపీ క్షత్రియ ఫెడరేషన్ను ఏర్పాటుచేసి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు సీఎంకి వివరించిన ప్రతినిధులు.
ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం ఉంటుందని సీఎం హామీ.
హాజరైన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏపీ క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటపతి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, క్షత్రియ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ టీవీఎస్ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు.
addComments
Post a Comment