విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రికుల రాకపోకలు.

 

 విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  హజ్ యాత్రికుల రాకపోకలు


- డిప్యూటి సిఎం మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు అంజాద్ బాషా

రాష్ట్రం నుంచి తొలిసారిగా హజ్ యాత్రికుల ప్రయాణం  విజయవాడ అంతార్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభం అవుతుండటం ఒక సరికొత్త అధ్యాయం అని  డిప్యూటి సిఎం మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు అంజాద్ బాషా పెర్కొన్నారు . జూన్ 7 నుంచి విజయవాడ అంతార్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రికుల రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజాం తో కలిసి బుదవారం విమానాశ్రయాన్ని  పరిశిలించారు . విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం  డైరెక్టరు లక్ష్మికాంత్ రెడ్డి,  విమానాశ్రయం  భద్రతాధికారి వెంకటరత్నం, సిబ్బంది తో విమానాశ్రయ ప్రాంగంణం అంతా పరిశీలించారు.   డిపార్చర్, అరైవల్, కష్టమ్స్ ఏరియా లను పరిశీలించారు.  వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా డిప్యూటి సిఎం మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు అంజాద్ బాషా మాట్లడుతూ జూన్ 7 న మొడటి విమానంలో హజ్ యాత్రకు 155 మంది హజిలు బయలుదేరతారన్నారు. 22 తేదివరకు ప్రతిరోజూ  హాజిలతో  ప్రత్యెక విమానాలు విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరతాయన్నారు.   విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం  ప్రాంగణంలో అన్ని రకాల ఏర్పాట్లను చేశామన్నారు.  హాజిలు వెళ్ళడం,  తిరుగు ప్రయాణం విజయవాడ నుంచి కొనసాగనున్న నేపథ్యంలో ముఖ్యమంతి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా వుంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో హజ్ కమిటి సభ్యులు & ఎమ్మేల్సీ కాంట్రాక్టర్ ఇషాక్ బాషా,  హజ్ కమిటి సిఇవో ఎల్ అబ్దుల్ ఖాదీర్, హజ్ కమిటి సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.


Comments