కేఎస్‌ భరత్‌ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ కేఎస్‌ భరత్‌ (కోన శ్రీకర్‌ భరత్‌).


కేఎస్‌ భరత్‌ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.



టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించిన కేఎస్‌ భరత్‌.


ఈ సందర్భంగా సీఎంతో జరిగిన సమావేశం గురించి కేఎస్‌ భరత్‌ ఏమన్నారంటే...


జగన్‌ సార్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కీపర్ గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉంది, ఈ విషయాలు సీఎంగారితో పంచుకున్నాను. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు, సార్‌ మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని చెప్పాను. సీఎంగారు కూడా దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయి, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుంది. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుంది. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారు, థ్యాంక్యూ. 


ఈ సమావేశంలో కేఎస్‌ భరత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, ఎంపీ పి.వి.మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

Comments