రాష్ట్ర స్థాయిలో క్రీడలకు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ఏర్పాటుకు చర్యలు

 రాష్ట్ర స్థాయిలో క్రీడలకు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ఏర్పాటుకు చర్యలు


రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం

విశాఖ,విజయవాడ,మంగళగిరిల్లో క్రీడా ఎకాడమీల ఏర్పాటుకు కృషి

వివిధ జిల్లాల్లో 16 స్పోర్ట్సు స్కూళ్ళు ఏర్పాటుకు ప్రణాళిక

ప్రతిభ గల క్రీడాకారులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలి

గ్రామ,మండల,నియోజకవర్గ స్థాయిలో క్రీడాపరమైన మౌలిక సదుపాయాలు పెంచాలి

ఆడుదాం ఆంద్ర క్రీడా పోటీల విజయవంతానికి కార్యాచరణ సిద్ధం చేయండి

              రాష్ట్ర నూతన క్రీడా విధానంపై సమీక్షలో సిఎస్ జవహర్ రెడ్డి

అమరావతి,4 జూలై (ప్రజా అమరావతి);:రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 2023-28 రాష్ట్ర క్రీడా విధానంపై క్రీడల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్బంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాయని అది మంజూరైతే రాష్ట్రానికి క్రీడా పరంగా దేశంలోనే మరింత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నం,విజయవాడ,మంగళగిరిల్లో మూడు క్రీడా ఎకాడమీలను ఏర్పాటు చేసేందుకు నూతన క్రీడా విధానంలో పొందుపర్చాలని చెప్పారు.అలాగే వివిధ జిల్లాల్లో 16 క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రతి క్రీడా పాఠశాలలో 100 మంది బాలురు,100 మంది బాలికలకు 16 విభాగలకు సంబంధించిన వివిధ క్రీడల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్.జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.వీటి ఏర్పాటుకు సంబంధించి ఎంత వరకు భూమి,నిధులు ఇతర అవసరాలు కావాలనేదానిపై పూర్తి స్థాయిలో అంచనా వేసి నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర్లంలో ప్రతిభ గల క్రీడా కారులను గుర్తించి వారిని అన్నివిధాలా ప్రోత్సహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.అదే విధంగా గ్రామ,మండల,అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో క్రీడాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరిట గ్రామ స్థాయి నుండి నిర్వహించనున్నక్రీడా పోటీలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యంతో విజయంవతం చేసేందుకు పూర్తి స్థాయి కార్యాచరణతో సిద్ధం కావాలని ఆదేశించారు.స్కూల్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్య,రెసిడెన్సియల్ విద్యాలయాలకు చెందిన అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి చర్చించడం జరుగుతుందని అన్నారు.

అంతకు ముందు రాష్ట్ర యువజన సర్వీసులు,క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ 2023-28 రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించి ముఖ్య అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ప్రతిభ గల క్రీడాకారులను ముందుగానే గుర్తించి వారికి తగిన శిక్షణను ఇవ్వడం వారికి సంబంధించిన డేటాబేస్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అదే విధంగా ప్రతి క్రీడాకారుని లోని ప్రతిభను గుర్తించి వారు రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీ స్థాయిలో రాణించేందుకు అవసరమైన తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు.పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకూ ప్రత్యేకంగా పిఇటి.పిడి లను ఏర్పాటు చేసి వివిధ అంశాల్లో విద్యార్ధులకు క్రీడాపరమైన శిక్షణను ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.స్పోర్ట్సు క్లబ్ లు,యోగా అసోసియేషన్ల సహకారంతో అన్ని విశ్వ విద్యాలయాల్లో యోగా పధం శిక్షణను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన కేలండర్ ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.ఇంకా ఈక్రీడా విధానానికి సంబంధించి తీసుకోనున్న వివిధ వినూత్న కార్యక్రమాలు తదితర అంశాల గురించి ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ వివరించారు.

ఈసమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ఎండి హర్షవర్ధన్,ఎఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image