ఆస్టర్,రమేష్" హాస్పిటల్స్ కలయికతో ఆరోగ్య సంరక్షణలో ఒక వినూత్న శకం ఆరంభం.

 *అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు దిగ్గజాలు "ఆస్టర్,రమేష్" హాస్పిటల్స్ కలయికతో ఆరోగ్య సంరక్షణలో ఒక వినూత్న శకం ఆరంభం


*

అమరావతి (ప్రజా అమరావతి);

భారతదేశం మరియు గల్ఫ్ దేశాల నందు 32 కు పైగా  హాస్పిటల్స్,127 క్లినిక్ లు,521 ఫార్మసీలు,205ల్యాబ్ లు 30 వేలకు పైగా ఉద్యోగులతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తున్న ప్రముఖ బహుళ జాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ ఆస్టర్ డి.ఎం హెల్త్ కేర్ మరియు ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన హెల్త్ కేర్ సర్వీసులను అందిస్తున్న రమేష్ హాస్పిటల్స్ ప్రజలకు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ అందించే క్రమంలో భాగంగా 2016 వ సంవత్సరం నుంచి కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ఉన్నత స్థాయి వైద్య సంరక్షణ, అధునాతన వైద్య సదుపాయాలు,సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో భాగంగా విజయవాడ గుంటూరు మరియు ఒంగోలులో ఉన్న నాలుగు హాస్పిటల్స్ ఇప్పుడు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గా రూపాంతరం చెందాయి.


ఆస్టర్ డి.ఎం హెల్త్ కేర్ తో అనుబంధం గురించి  డాక్టర్.పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ లో వారి యొక్క భాగస్వామ్య సహకారంతో ఆరోగ్య సంరక్షణలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఒక బహుళ జాతి సంస్థగా తమ సంస్థ రూపాంతరం చెందిందని అదేవిధంగా  భారతదేశంలో వైద్య సేవలు అందిస్తున్న ఆస్టర్ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య బృందం సహకారంతో రోబోటిక్ సర్జరీలు,గుండె,లివర్ అవయవ మార్పిడి మరియు క్యాన్సర్ వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. 15 సంవత్సరాలుగా టెలి మెడిసిన్ రంగంలో  ఉన్న అనుభవంతో వైద్యంలో శాస్త్రీయ పద్ధతులను, ఎప్పటికప్పుడు మారుతున్న వైద్య విధానాలను అందిపుచ్చుకునే క్రమంలో భాగంగా డాక్టర్ ఆజాద్ మూపెన్ సారథ్యంలో  నడుస్తున్న వయనాడ్ మెడికల్ కాలేజ్ వైద్యులు మరియు ఆస్టర్ నెట్ వర్క్ లోని సూపర్ స్పెషాలిటీ వైద్యుల అనుసంధానంతో వైద్య విద్యా సంబంధమైన మరియు జన్యుపరమైన అధ్యయన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటున్నామని డాక్టర్ రమేష్ బాబు తెలియచేశారు.

ఆస్టర్ సంస్థతో భాగస్వామ్యం  ద్వారా వారి యొక్క విలువైన సహకారంతో జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణ సంస్థల గుర్తింపు పొందడం మరియు మెడికల్ టూరిజం ద్వారా విదేశీ రోగులకు కూడా వైద్యాన్ని అందిస్తున్నామని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ ప్రాంత ప్రజల ఆదరణ చూరగొన్న  ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నాణ్యమైన,అధునాతన వైద్య సేవలు అందించడానికి మరింత వీలు కలుగుతుందని తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్ లో విస్తరణ మరియు ఆస్టర్ రమేష్ పునర్నిర్మాణం పై ఆస్టర్ హెల్త్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రమేష్ హాస్పిటల్స్ కీలకమైన కృషి చేసిందని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సేవలందించే క్రమంలో భాగంగా ఈ పునర్నిర్మాణం ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాలకు,దేశాలకు వెళ్లే అవసరం లేకుండా ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు మరియు ఆంకాలజీ వైద్య విభాగంలో టెర్షరీ మరియు క్వార్టర్నరీ శ్రేణి వైద్య సంరక్షణ సదుపాయాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని  ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లో ఎంతో కీలకమైన ఆస్టర్ మెడికల్ అడ్వైజరీ బోర్డులో క్లినికల్ మరియు అకడమిక్ అనుభవం కలిగిన డాక్టర్ రమేష్ బాబు చేరడం ద్వారా అధునాతన వైద్య విధానాలను అందిపుచ్చు  కోవడంలో ఆస్టర్ నెట్ వర్క్ లో ఉన్న వైద్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ ఆజాద్ మూపెన్ తెలియజేశారు.


ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ పునర్నిర్మాణం మరియు భవిష్యత్  ప్రణాళికల గురించి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీష్ శెట్టి  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన బహుళ జాతి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఆస్టర్ రమేష్ ఆస్పత్రులు ముందంజలో ఉండే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని ఎప్పటికప్పుడు అధునాతన  వైద్య నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం ద్వారా సమగ్రమైన మరియు సంతృప్తికరమైన ఆరోగ్య ఫలితాలను రోగులకు అందించడానికి  మరింత అంకితభావంతో కృషి చేస్తామని తెలియజేశారు.


ఈ పత్రికా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం.ఎస్.రామ్మోహనరావు,

ఆస్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సునీల్ కుమార్,రీజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవానంద్,డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్.పావులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image