అంబేడ్కర్ స్మృతి వనం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నాం.

 


                   అంబేడ్కర్ స్మృతి వనం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నాం.



విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్రం నడిబొడ్డున భారతదేశం గర్వించదగ్గ స్మృతుల్లో ఒకరైన అంబేడ్కర్ కు ఘన నివాళిగా 20 ఎకరాల్లో స్మృతివనం, దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేడ్కర్ స్మృతివనం పనులను సజ్జల రామకృష్ణారెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్ మేరుగు నాగార్జున తదితరులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ  ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో సమానత్వ దిశగా వడివడిగా అడుగులు వేయటానికి కారణం అంబేడ్కర్ అని కొనియడారు. ప్రజాస్వామ్య పాలనకు బీజం వేసింది అంబేడ్కర్ అని అన్నారు.  నేడు ఆరోగ్యకరమైన వాతావారణం ఏర్పడిందంటే అంబేడ్కర్ ఆలోచనే అని తెలిపారు. అసమానతలు తొలిగి సమానత్వంకు పెద్దపీట వేయగలిగామన్నారు. అంబేడ్కర్ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.              

               ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటే అది అంబేడ్కర్ గోప్పతనమేనన్నారు. భారతదేశాన్ని అంటరానితనం అనే రోగం శతాబ్ధాల తరబడి పీడించిందని, అంతటి రోగానికి మందు వేసి రూపుమాపిన వారిలో అంబేడ్కర్ కు మొదటి స్థానం దక్కుతుందన్నారు.  అంతటి మహానుభావుడిని స్మృతి చిహ్నంగా అతిపెద్ద విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన చేయటమే కాకుండా ఏర్పాటు చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కోవిడ్ సమయంలో సైతం అంబేడ్కర్ స్మృతి వనం పనులు మొదలుపెట్టి శరవేగంగా పూర్తిచేయటానికి చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు. ఈ ఏడాది అంబేడ్కర్ స్మృతి వనం పనులు పూర్తి చేసి దేశానికి, రాష్ట్రానికి అంకితం చేయనున్నామన్నారు.  అంబేడ్కర్ స్మృతి వనంలో అంతర్జాతీయ స్థాయి రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. 

                    దేశంలో, రాష్ట్రంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అతి త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతి కి అంకితం చేయనున్నాడని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్ మేరుగు నాగార్జున అన్నారు. డాక్టర్ బి. ఆర్ . అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే గొప్ప చారిత్రక కట్టడం కాబోతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర పుటల్లో లిఖించే విధంగా నిలిచిపోతుందన్నారు. ఆ మహాత్ముని స్మరించుకునేలా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు.  అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహ ఏర్పాటుకు రూ. 400 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారని, అతి త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.

                   కార్యక్రమంలో ఎంఎల్ఏ రక్షణ నిధి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, సాంఘీక సంక్షేమ శాఖ డైరక్టర్ విజయ కృష్ణన్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image