చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి.



*నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : డిప్యూటి సి.ఎం*


*చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి*



*పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : నేదురుమల్లి రాంకుమార్* 


తిరుపతి , ఆగష్టు 19 (ప్రజా అమరావతి): నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మన ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అధికారులు కుల, వర్గ, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి అధికారులను ఉద్దేశించి అన్నారు. 

 

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో వెంకటగిరి నియోజక వర్గ సమీక్ష జిల్లా ఇంచార్జి మంత్రి మరియు ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక శాఖ నిర్వహించగా వెంకటగిరి నియోజక వర్గ సమన్వయ కర్త మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జెసి డి.కె.బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, జిల్లా, సంబంధిత డివిజన్ , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ సమీక్షలో రాంకుమార్  సూచించిన అవరమైన పనులకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. పేదల తలరాతలు మార్చుతున్న ఈ ప్రభుత్వానికి అండగా వుండి ప్రజలకు సేవలందిస్తూ, అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామాల్లో స్మశాన వాటికల కొరకు స్థలాలను ఇప్పటివరకు ఇచ్చినవి కాకుండా ఇంకా అవసరమున్న చోట స్థలాలను గుర్తించి కేటాయించాలని, రహదారి ఏర్పాటుకు సూచించారు. సిఎం గారి హామీలపై దృష్టి సారించి ప్రతిపాదనలు పంపి, పరిష్కరించి, పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  నియోజక వర్గ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు ప్రభుత్వానికి నివేదించి తక్షణ  చర్యలు తీసుకోవాలని జేసి కు సూచించారు. 


నేదురుమల్లి రాంకుమార్ మాట్లాడుతూ ముందుగా గౌ. ముఖ్యమంత్రి వెంకటగిరి పర్యటనను విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ప్రజల్లో గడప గడపకు మన ప్రభుత్వం లో తిరుగుతున్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, కమ్యూనిటీ కి ఉపయోగపడే సమస్యలు తెలుసుకున్నానని, ప్రజా ప్రతినిధులు సూచించిన మరియు తెలియజేసిన అంశాలు పరిశీలించి సత్వర పరిష్కారం కోసం అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి కి సంబంధించి పలు సమస్యల పై చర్చిస్తూ ఆల్తూరు పాడు రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయని నిధుల విడుదలపై, ప్రాధాన్యత భవనాలు నిర్మాణానికి నిధుల విడుదల అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర పండుగగా ప్రకటించారని ధన్యవాదాలు తెలుపుతూ పండుగ నిర్వహణకు, అభివృద్ధికి నిధుల విడుదల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. మునిసిపల్ పరిధిలోని కూరగాయల, మాంస విక్రయ భవనం పూర్తి శిథిలావస్థలో ఉందని నూతన భవన నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని, జగనన్న కాలనీ లేఅవుట్ కు రోడ్ కనెక్టివిటీ అంశాలకు సంబంధించి అంచనాల ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సూచించారు. ఏపి టిడ్కో కింద మంజూరైన గృహాలలో మౌలిక సదుపాయాల కల్పన, జీస్ఆర్ ఉన్న నీటి ట్యాంకు కు అదనంగా ఏర్పాటు, జగనన్న కాలనీ లో విద్యుత్, నీటి, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆర్చి నిర్మాణం పూర్తి కి చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ అధికారులను, ఎస్ ఈ ఆర్ డబ్లూ ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవనాల నిర్మాణం వేగవంతం చేయాలనీ, పేమెంట్ లో టెక్నికల్ సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలని తగు ప్రతిపాదనలను పంపాలని సూచించారు. అక్టోబర్ విజయదశమి నాటికి పెద్ద ఎత్తున టిడ్కో, జగనన్న కాలనీ గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద రానున్న కాలంలో విస్తరణకు ప్రభుత్వ స్థల సేకరణ జరగాలని పరిశీలించాలని సూచించారు. ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల మరమ్మత్తులు కల్వర్టులు నిర్మాణాలు జరుగుతున్నాయని, పురోగతి వేగవంతం చేయాలని అన్నారు.


ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లా అధికారుల వారి స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నియోజక వర్గ సమీక్షలో సూచించిన అంశాలు పై అధికారులు దృష్టి పెట్టాలని, ప్రభుత్వానికి నివేదించాల్సినవి వెంటనే పంపాలని సూచించారు.


ఈ సమీక్షలో జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image