శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి.

 శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి


తిరుమల, 14 ఆగష్టు (ప్రజా అమరావతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సోమవారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ హుండీలో కానుకలు సమర్పించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

Comments