నెల్లూరు, ఆగస్టు 7 (ప్రజా అమరావతి);:
జగనన్నకు చెబుదాం (స్పందన) అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ తో కలిసి జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినపుడు సకాలంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమం లో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా తనిఖీ చేసి సంతృప్తికరంగా పరిష్కార మార్గం చూపించాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉందని, అర్జీదారులు కూడా ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
శ్రీమతి వి. గాయత్రి అనే దివ్యంగురాలికి బ్యాక్ లాక్ ఖాళీల భర్తీ కింద నియామక పత్రాన్ని కలెక్టర్ అందించారు.
ఈ కార్యక్రమంలో డిపివో శ్రీమతి సుస్మిత, డిఆర్డిఏ, ఐసిడిఎస్ పిడిలు కె. సాంబశివారెడ్డి, హేనా సుజన్ , డిఎంహెచ్వో పెంచలయ్య, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఇవో గంగా భవాని, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, సాంఘిక సంక్షేమ అధికారి రమేష్,ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి A సర్వే హనుమాన్ ప్రసాద్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment